Big Stories

Bandi Sanjay : ముఖ్యమంత్రిని గ్రామ ఇంచార్జ్‌ స్థాయికి తీసుకొచ్చిన ఘనత బీజేపీది..

Bandi Sanjay : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు. బీజేపీ పార్టీ మాత్రమే అసలైన ఉద్యమకారులకు వేదికగా ఉందన్నారు.

- Advertisement -

బూరనర్సయ్య లాంటి ఉద్యమకారులు టీఆర్ఎస్, కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారే పరిస్థితి తెచ్చిన ఘనత బీజేపీ పార్టీదన్నారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న కే
సీఆర్ మాటతప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన నిదులను కూడా ఇవ్వడం లేదన్నారు బండి సంజయ్. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్‌లో చేరారన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News