Telangana: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలివిడత 129 చోట్ల సర్పంచి అభ్యర్థులుగా ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో ఈ స్థానాలన్నీ ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. న
4,231 సర్పంచ్ పదవులకు 22,330 నామినేషన్లు..
వంబరు 29తో తొలివిడత పంచాయతీలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 4,231 సర్పంచి పదవులకు గాను.. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 22,330 మంది మిగిలారు. ఈ పంచాయతీల్లో నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఏకగ్రీవాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్..
నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,950 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 గురు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోనే ఇది అత్యల్పం.
Also Read: ఢిల్లీలో మంత్రి లోకేష్, పార్టీ ఎంపీలతో భేటీ, సడన్గా హస్తిన టూర్ వెనుక
మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఖాళీగా మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలు
మంచిర్యాల జిల్లాలోని 3 పంచాయతీలతోపాటు 34 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎస్ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొమురంభీమ్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంతోపాటు 30 వార్డులకు, నిర్మల్ జిల్లాలో ఒక పంచాయతీతోపాటు 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్ జిల్లాలో 19, జనగామ జిల్లాలో 10 వార్డులకు, మరికొన్ని జిల్లాల్లో కూడా కొన్ని వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్ఈసీ తెలిపింది.