E-Paper
Advertisement

BREAKING: తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం

BREAKING: తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం
Advertisement

Telangana secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడ్డాయి. అదృష్టావశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

వివరాల ప్రకారం.. తెలంగాణ సెక్రటేరియట్ సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ అంతస్తులో పెచ్చులు స్వల్పంగా ఊడిపడ్డాయి. ఐదో అంతస్తు నుంచి బయటకు వచ్చే మెయిన్ ఎంట్రన్స్ వద్ద పెచ్చులు ఊడిపడడంతో ప్రమాదం జరిగింది. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. ప్రమాదంలో కారు డ్యామేజ్ అయనట్లు తెలుస్తోంది. కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. నిర్మాణ సమయంలోనూ కొన్ని అపశృతులు దొర్లినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రూ.1200 కోట్లతో సచివాలయాన్ని నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే సచివాలయ నిర్మాణానికి భారీ ఖర్చుపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

Also Read: Astronauts Butch Wilmore Sunita Williams : ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే సునితా విలియమ్స్.. భూమిపైకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్

అయితే, ఈ సచివాలయాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మాణం నుంచే కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నాయకులు పలు ఆరోపణలు చేశారు. సచివాలయ నిర్మాణంలో సమస్యలు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా సచివాలయ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఛాంబర్ తో పాటు.. టాయ్ లెట్స్ లోనూ శబ్ధాలు వస్తున్నాయని అధికారులకు వివరించారు. ఇదంతా లోలోపల జరిగింది.. కానీ ఇవాళ సచివాలయం సౌత్, ఈస్ట్ ప్రధాన ద్వారా లోపలికి వెళ్లే ప్లేస్ లో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే మంత్రులు, అధికారులు వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. అయితే ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడి కారుపైన పడ్డాయి. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో అధికారులు, అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సచివాలయంలో నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించాలని నెటిజట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×