E-Paper
Advertisement

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి

Fire Accident : శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో చోటుచేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరంతా.. దట్టంగా పొగలు వ్యాపించడంతో ఊపిరాడక మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఘటన విషయాలు తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. హుటాహుటిన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

నార్శింగి పరిధిలోని పుప్పాలగూడలోని ఓ రెండు అంతస్తుల భవనంలో సాయంత్రం వేళ మంటలు చెలరేగాయి. బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. తొలుత భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న లంగర్‌ హౌస్‌ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా కమ్ముకున్న పొగల మధ్యలోనే భవనంలోకి వెళ్లిన సహాయక సిబ్బంది.. ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు.

వీరిని మొదటి అంతస్తులోని ఓ గదిలో గుర్తించగా.. వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. పొగను పీల్చడంతో వారంతా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దాంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దట్టంగా అలుముకున్న పొగ మధ్యలో వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే క్షీణించినట్లుగా వైద్యులు గుర్తించారు.  కొంత సేపటికి ఆసుపత్రిలోనే ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలొదిలారు.

ఈ ఘటనలో మృతి చెందిన వారికి సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో ఐదుగురిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మంటల ధాటికి భవనంలోని మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో.. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అయితే.. అసలు బిల్డింగ్ లోని గ్రౌండ్ ప్లోర్లో మంటలు ఎందుకు వ్యాపించాయి. ఎలా ప్రమాదం జరిగింది అనే విషయాలను మాత్రం గుర్తించలేదు. ఈ ప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చినట్లు చెబుతున్నఅగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ లో మనుషులు చిక్కుకున్నారనే సమాచారంతో.. ల్యాడర్ ద్వారా పైకి వెళ్లిన సిబ్బంది.. తలుపులు పగులగొట్టి బాధితుల్ని కాపాడారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×