Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, వచ్చే రెండు పర్యాయాలు కూడా పార్టీయే అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉన్నదన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87.5 శాతం టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని చాటుకుందన్నారు.
Also Read:Balka Suman: బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా ఉస్మానియాలో సెగలు.. రేవంత్, వివేక్ దిష్టిబొమ్మల దహనం
క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, దాదాపు 67 శాతం బీసీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారని ఆయన పేర్కొన్నారు.సీట్ల కేటాయింపు పూర్తిగా సర్వేల ఆధారంగా, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల పనితీరును బట్టే ఉంటుందని సీనియర్ నేత జీవన్ రెడ్డికి సూచించారు.పాలనపై ప్రజామోదంరాష్ట్రంలోని 94 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఇస్తున్న మద్దతుకు నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్లో ఐదు సీట్లలో ఎంఐఎం అభ్యర్థులపై గెలవడం విశేషమని, మేయర్ పదవి దక్కితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న కార్పొరేటర్ల ఆలోచనను ఆయన స్వాగతించారు.
జరగబోయే కీలక సమావేశంలో అన్ని రాష్ట్రాల పనితీరుపై ఏఐసీసీ సమీక్ష నిర్వహించనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష పూర్తయిందని, పార్టీ నిర్మాణం, సంక్షేమ అజెండాపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులపై పీసీసీ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: AP Politics: మన్యంలో కలహాభోజనుడు.. జిల్లాపై పట్టుకోసం పావులు కదుపుతున్న ఘనుడు..?