E-Paper
Advertisement

Congress-Aimim : ఎంఐఎంతో దోస్తీ కుదరని పని : మహేశ్ కుమార్ గౌడ్

Congress-Aimim : ఎంఐఎంతో దోస్తీ కుదరని పని : మహేశ్ కుమార్ గౌడ్
Advertisement

ఎంఐఎంతో దోస్తీ
కుదరని పని !

– హైడ్రా టార్గెట్ పేదలు కాదు
– ఆక్రమించిన బడాబాబులు
– మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్‌ది అనవసర రాద్దాంతం
– అసలు ఆ ప్రతిపాదన తీసుకొచ్చిందే కేసీఆర్
– జిల్లాల పర్యటనల తర్వాతే పీసీపీ కమిటీలు
– స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ
– ఎంఐఎంతో పొత్తు ప్రస్తావనే వద్దు
– టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: ఏఐసీసీ నేతలంతా బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గ నియామకం ఆలస్యం అయిందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారనేది ప్రతిపక్ష పార్టీల ప్రచారమేనన్నారు. ఈ విషయంపై అధిష్టానం వివరణ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎంతో స్నేహం వేరు, శాంతిభద్రతలు వేరని చెప్పారు మహేష్ గౌడ్, ఫిరోజ్ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.

కఠినంగా ఉంటాం…

Advertisement

దాడుల విషయంలో కఠినంగా ఉంటామని తెలిపారు. దసరాకు రెండో విడత కార్పొరేషన్ పదవులు అనుకున్నామని, కుదరలేదని, దీపావళి లోపు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళ్తానన్న టీపీసీసీ చీఫ్, భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి అని వివరించారు. మూసీ అభివృద్ధి‌ కోసం లక్షా 50 వేల కోట్లని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రేమతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని, ఎలాంటి ఒత్తడి లేదని వ్యాఖ్యానించారు.
పూర్తి కథనం…
————-

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×