Mahesh Kumar Goud: బేగంపేట్లోని ది హోటల్ ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించారు.
Also Read: చెల్లెలి ఫోనే వదల్లేదు.. మళ్లీ వస్తే ఇళ్లల్లో సీసీ కెమెరాలే.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్!