E-Paper
Advertisement

రూ.21 లక్షల కారు గెలుచుకున్న వైభవ్..కానీ 2029 దాకా ట‌చ్ చేయొద్దంటూ కండీష‌న్స్

రూ.21 లక్షల కారు గెలుచుకున్న వైభవ్..కానీ 2029 దాకా ట‌చ్ చేయొద్దంటూ కండీష‌న్స్
Advertisement

Vaibhav Sooryavanshi has won a car:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య ఫైట్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన బెంగుళూరు, టైటిల్ రెండోసారి గెలుచుకుంది. అయితే ఈ నిన్న టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో అందరికీ ప్రైజ్ మనీలు ఇచ్చారు. ఇందులో భాగంగానే వైభవ్ సూర్య వంశీకి టాటా సియెర్రా కారు కూడా వచ్చేసింది.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

ఐపీఎల్ 2026లో టాటా కారు దక్కించుకున్న వైభవ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో ప్రమాదకరమైన స్ట్రైక్ రేట్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో 237.70 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ కింద 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ టాటా సియెర్రా కారు ( TATA Sierra) దక్కించుకున్నాడు. ఈ కారు ధర రూ. 21 లక్షలు ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్ తో ఈ టాటా కారు లాంచ్ అయింది.

మూడేళ్ల తర్వాతే, డ్రైవింగ్ చేయనున్న వైభవ్

ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ 18 సంవత్సరాలకు మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. అతనికి ఎన్ని కార్లు గిఫ్ట్ ఇచ్చినా, పెద్దగా ప్రయోజనం ఉండదు. మరో మూడు సంవత్సరాలు దాటితే తప్ప వైభవ్ సూర్యవంశీ కారు నడపలేడు. ఈ క్రమంలో ఐపీఎల్ ద్వారా వచ్చిన టాటా సియెర్రా కారును ఇంటి దగ్గర పార్క్ చేసుకోవాల్సిందే. మూడేళ్ల తర్వాత డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

రూ. 45 లక్షలు సంపాదించిన వైభవ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రానించి మొత్తం 45 లక్షల విలువైన అవార్డులు, డబ్బులు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్, అత్యధిక సిక్సర్లు, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ కింద మొత్తం 45 లక్షలు సంపాదించగలిగాడు. ఇందులో టాటా సియెర్రా కారు కూడా ఉంది. ఇది ఇలా ఉండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సమయం లోనే టోర్నమెంట్ లోకి అడుగు పెట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఆ సందర్భంగా కోటి పది లక్షలు పెట్టి మరి వైభవ్ ను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ఇక ఇప్పుడు అతడు వేలంలోకి వెళ్తే, 30 కోట్లు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాంచైజీలు వెల్లడిస్తున్నాయి. దీంతో 2027 మెగా వేలం సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ను వీడి.. బయటకు వస్తాడని వైభవ్ పై పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×