E-Paper
Advertisement

Ts Govt: పోడు రైతులకు పట్టాలు.. గృహలక్ష్మి పథకం అమలు.. కాశీలో వసతి గృహాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..

Ts Govt: పోడు రైతులకు పట్టాలు.. గృహలక్ష్మి పథకం అమలు.. కాశీలో వసతి గృహాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..
Advertisement

Ts Govt: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు ఐదు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4 లక్షల మందికి.. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. అలాగే ఒక్కో లబ్ధి దారుడికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందివ్వనున్నారు. ఈ పథకానికి రూ. 12 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

అలాగే ఈ ఏడాది 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధం ఇవ్వాలని .. ప్రతి ఏటా ఆగష్టు 16న రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించి ఆగష్టు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మంత్రి వర్గం ఆదేశించింది.

అతి త్వరలోనే అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,55,393 మందికి పోడు భూముల పట్టాలను త్వరలోనే అందివ్వనున్నారు.

Advertisement

హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులందరినీ ఈవేడుకకు ఆహ్వానించి అందరి సమక్షంలో గొప్ప పండుగలా విగ్రహాన్ని ఆవిష్కరించాలని నేతలు నిర్ణయించారు. అలాగే కాశీలో తెలంగాణ ప్రభుత్వ పక్షాణ ఓ వసతి గృహం నిర్మించాలని నిర్ణియించారు. ఇందుకోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Tags

Related News

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

Big Stories

Advertisement
×