E-Paper
Advertisement

Business with Blood: రక్తంతో దందా.. హైదరాబాద్‌లో 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ

Business with Blood: రక్తంతో దందా.. హైదరాబాద్‌లో 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ
Advertisement

Notices Issued to 9 Blood Banks: హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకులు గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్న అక్రమ దందాలపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 9 బ్లడ్ బ్యాంకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నగరంలోని మలక్‌పేట, చైతన్యపురి, లక్డీకపూల్‌, హిమాయాత్‌ నగర్‌, సికింద్రాబాద్‌, కోఠి, మెహదీపట్నం, బాలానగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లోని 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు విరుద్ధంగా నాసిరకం పరికరాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంతే కాదు రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయని తెలిపారు. ఆయా బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాల ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని సేకరిస్తారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు రక్తాన్ని అందజేయాల్సి ఉంటుంది. కానీ నగరంలో పలు బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు.

Read More: గద్దెనెక్కిన సమ్మక్క.. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్ తమిళిసై..

Advertisement

దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని గాంధీ, నిలోఫర్, ఉస్మానియా, సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. కానీ దానిని బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు అసలు పట్టించుకోవడం లేదు. సేకరించిన రక్తంలో ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో కూడా లోపాలు ఉన్నాయి. దీంతో రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు బ్లడ్ బ్యాంకులపై దాడులు చేశారు.

Tags

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×