E-Paper
Advertisement

TSPSC : 5 కాదు 15 ప్రశ్నాపత్రాలు లీక్.. బోర్డు సభ్యుడి పీఏ అరెస్ట్..

TSPSC : 5 కాదు 15 ప్రశ్నాపత్రాలు లీక్.. బోర్డు సభ్యుడి పీఏ అరెస్ట్..
Advertisement

TSPSC : పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళుతోంది. TSPSC బోర్డు సభ్యులను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఏడుగురు బోర్డు సభ్యులు స్టేట్ మెంట్ రికార్డు చేయనుంది. మరోవైపు బోర్డు సభ్యుడు లింగారెడ్డి దగ్గర పీఏ పనిచేస్తున్న రమేష్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్ -1 పేపర్ ను రమేష్ లీక్ చేసినట్లు గుర్తించారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలను సిట్‌ గుర్తించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ – ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ – డీఏవో జనరల్ స్టడీస్, మ్యాథ్స్ – ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు – ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2 – టౌన్ ప్లానింగ్ – జులైలో జరగాల్సిన జేఎల్‌ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి.ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement

లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు గాని ప్రాథమిక ఆధారాలు లభిస్తే పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోంది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×