E-Paper
Advertisement

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం.. ఫ్రీగా వైఫైతో పాటు మరెన్నో సదుపాయాలు

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం.. ఫ్రీగా వైఫైతో పాటు మరెన్నో సదుపాయాలు
Advertisement

TSRTC: టీఎస్‌ఆర్టీసీ మొట్టమొదటి సారి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులకు లహరి-అమ్మఒడి అనుభూతిగా పేరుపెట్టారు. సోమవారం ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు.

మొత్తం 16 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. తిరుపతి, చెన్నై, వైజాగ్, హుబ్బళ్లి మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నారు. 12 మీటర్ల పొడవుండే ఈ బస్సులో లోయర్ 15, అప్పర్ 15 ఇలా మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఇక ఈ బస్సులో ప్రయాణికులకు ఉచితంగా వైఫై అందిస్తున్నారు. అలాగే ప్రతి బెర్త్‌కు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్ ల్యాంప్ ఉంటాయి.

Advertisement

ప్రయాణికుల భద్రత కోసం బస్సులో సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారమ్, పానిక్ బటన్‌తో పాటు బస్సు ట్రాకింగ్ సిస్టం వంటి సదుపాయాలను కల్పించారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×