E-Paper
Advertisement

NBK: పదవి చూసుకొని నీకు పొగరేమో.. బోర్డు మీద పేరు మారుతుందేమో.. బాలయ్య డైలాగ్స్ జగన్ మీదేనా!?

NBK: పదవి చూసుకొని నీకు పొగరేమో.. బోర్డు మీద పేరు మారుతుందేమో.. బాలయ్య డైలాగ్స్ జగన్ మీదేనా!?
Advertisement

NBK: వీరసింహారెడ్డి. ఒంగోలులో వీర విహారం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అదుర్స్. బాలయ్య స్పీచ్ బెదుర్స్. ఒంగోలు గిత్తలా.. ఫుల్ హుషారుగా కనిపించిన బాలయ్య జోష్ అన్ స్టాపబుల్. అది సినిమాల్లోనైనా. రాజకీయాల్లోనైనా.

వీరసింహారెడ్డి థియేటర్ ట్రైలర్ కేక పెట్టిస్తోంది. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో.. పక్కా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో.. తమన్ మ్యూజిక్ తో ట్రైలర్ దుమ్ము రేపుతోంది. కత్తులు, కార్లు, యాక్షన్ సీన్లు.. అన్నీ ఇంకో లెవల్ లో ఉన్నాయి. మరి, బాలయ్య సినిమా అన్నాక.. అందులో పంచ్ డైలాగ్స్ లేకుండా ఉంటాయా? అదికూడా జగన్ ను, వైసీపీ సర్కారును పరోక్షంగా ఏదో ఒకటి అనకుండా ఉంటారా?

Advertisement

అనేశారు. ఈసారి కూడా జగన్ కు పంచ్ డైలాగ్ ఇచ్చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తనదైన చురుక్కులు అంటించారు. ట్రైలర్ లో రెండు డైలాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎప్పటిలానే పొలిటికల్ రచ్చ రాజుకుంది.

“పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏ కే పొగరెక్కువా”.. ఇదీ బాలయ్య నోటి నుంచి వచ్చిన ఓ డైలాగ్. ఇక్కడ పదవి.. పొగరు.. అని ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ పెట్టాలో వేరే చెప్పనవసరం లేదంటున్నారు. సోషల్ మీడియాలో అది జగన్ గురించే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ఇక, ఇటీవల వివాదాస్పదమైన మరో ఉదంతంపైనా వీరసింహారెడ్డి పంచ్ లు పేల్చారు. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు..మార్చలేదు”.. ఇదీ అసలైన డైలాగ్. ఇది అదేనంటూ టాక్ మొదలైంది.

ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది ఏపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ పేరు తీసేసి.. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టింది. యూనివర్సిటీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును తీసేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా, జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు. ఆ విషయాన్నే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వీరసింహారెడ్డిలో డైలాగ్ వదిలారని అంటున్నారు. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేదు”. ఇదీ కదా బాలయ్య పంచ్ అంటే.. అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×