Station Ghanpur Municipality: స్వేఛ్చ బ్యూరో: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ కొత్త పాలకవర్గం సోమవారం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక వాహనంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య 13 మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం టిఆర్ఎస్ నుండి గెలిచిన ఐదుగురు కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీవో డిఎస్ వెంకన్న తెలుగు అక్షర క్రమంలో కౌన్సిలర్లచే ప్రమాణస్వీకారం చేయించారు.
Also Read; Lakshminarayana: రాజకీయాలకు లక్ష్మీనారాయణ గుడ్ బై? మళ్లీ ఉద్యోగంలోకి..!
స్టేషన్ ఘన్ పూర్ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్(Vinay Kumar), వైస్ చైర్మన్ గా నీల రాజమ్మలు(Neela Rajamma) ఎన్నికయ్యారు. తాటికొండ వినయ్ కుమార్ (13వ వార్డు) పేరును హరినాథ్ (2వ వార్డ్) ప్రతిపాదించగా బొల్లు లక్ష్మి(15 వార్డు) బలపరచగా 12 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు ప్రకటించారు. వైస్ చైర్మన్ గా నీల రాజమ్మ (11 వ వార్డు) పేరును 18వ వార్డు సభ్యుడు పొన్న రవి ప్రతిపాదించగా తోకల అనూష (10 వార్డు) మద్దతు ప్రకటించారు. వీరి ఎన్నికతో కొత్త పాలక వర్గం కొలువుతీరినట్టైంది.
Also Read: Suspicious Death: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. పొలంలో మైననర్ బాలిక మృతి..!