Bribery Case: స్వేచ్ఛ బ్యూరో: వక్ఫ్ బోర్డు రికార్డుల్లో ల్యాండ్ను నమోదు చేసే విషయమై లంచం తీసుకుంటున్న నల్గొండ వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ షేక్ మహమూద్ను శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ వక్ఫ్ బోర్డు పరిధిలో ఇన్స్ స్పెక్టర్ మహమూద్ పెద్దవూర మండల కేంద్రంలో గల జామె మసీద్ అబూబకర్ సిద్ధిఖ్ రెహమతుల్లా అలాయ్ ఆస్తిని వక్ఫ్ బోర్డు రికార్డుల్లో నమోదు చేయాలని ఓ వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 25న వక్ఫ్ బోర్డు కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.
దీనికి సంబంధించి నివేదికను హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సీఈవోకు పంపించాల్సి ఉంటుంది.దీనికి గాను నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ మహమూద్ రూ.10వేల లంచాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడతో ఏసీబీ అధికారుల సూచనల మేరకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also read: Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!
అతని నుంచి రూ.10వేల లంచం సొమ్మును స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలోని మందుల వారి కాలనీలో వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ షేక్ మహమూద్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహమూద్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.
Also read: ఇంగ్లీష్ ఇరగదీసిన రేవంత్! తడబడకుండా.. సూటిగా! పాలనపై తనదైన మార్కును వివరించిన సీఎం!