BigTV English

CM Revanth Reddy: కాలేజీల బకాయిలు చెల్లిస్తాం.. సమ్మి నిర్ణయాన్ని విరమించుకోవాలి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: కాలేజీల బకాయిలు చెల్లిస్తాం.. సమ్మి నిర్ణయాన్ని విరమించుకోవాలి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ప్రైవేట్ కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. కాలేజీలు యథావిధంగా నడపాలని సీఎం అన్నారు.


రాష్ట్రంలోని సుమారు 2,000 ప్రైవేట్ కాలేజీలు దాదాపు రూ. 8,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ బకాయిలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్నాయి. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా సెప్టెంబర్ 15 నుండి కాలేజీలు మూసివేయాలని యూనియన్ నాయకులు నిర్ణయించారు. కాలేజీలు కొనసాగకపోతే లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యావకాశాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ఉద్యోగుల జీతాలు, అద్దెలు, ఇతర ఖర్చులు భరించలేకపోతున్నాయి. దీనివల్ల కొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. మరోవైపు, ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ హయాంలో ఆర్డర్ చేసిన విజిలెన్స్ రిపోర్ట్‌ను వెలికితీసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. అనేక కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని.. ఫ్యాకల్టీ-స్టూడెంట్ రేషియో సరిగా లేదని తెలిసింది. ల్యాబ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇలాంటి అక్రమాలు ఉన్న కాలేజీలకు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం వెనుకాడుతోంది.


ALSO READ: KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు లతో సమావేశమై కాలేజీలు బంద్ చేయకుండా యథావిధిగా నడపాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో బకాయలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మె విరమించాలని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయకూడదని సీఎం అన్నారు. ఈ చర్చలు సానుకూల దిశలో సాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాలేజీలు బంద్ అయితే సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడతాయి. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి రూ. 8,000 కోట్ల బకాయిలు పరిశీలిస్తోంది. కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ALSO READ: Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ ఎండ్ గేమ్ – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేటీఆర్ అనుమానం అదేనా?

ఈ సంఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోంది. ప్రభుత్వం, కాలేజీల మధ్య సమన్వయం లేకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినా, దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం. బకాయిలు చెల్లించడం, నాణ్యతా తనిఖీలు బలోపేతం చేయడం ద్వారా విద్యా వ్యవస్థను బలపరచాలి. ఇది విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కీలకం.

Related News

Indiramma Canteens: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. రూ.5కే టిఫిన్, ప్రారంభించనున్న సీఎం

Telangana Excise Raids: అక్రమ మద్యంపై.. ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్

Medha School Drugs Case: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. 2 లక్షలకు డ్రగ్స్ ఫార్ములా కొన్న ప్రిన్సిపాల్

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Telangana Journalists: తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త.. అక్రిడిటేష‌న్‌లపై పొంగులేటి కీలక అప్డేట్

Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ ఎండ్ గేమ్ – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేటీఆర్ అనుమానం అదేనా?

Big Stories

×