E-Paper
Advertisement

Weather Alert : తెలంగాణ ప్రజలూ..ఈ 5 రోజులు జాగ్రత్త.. హెచ్చరించిన వాతావరణశాఖ

Weather Alert : తెలంగాణ ప్రజలూ..ఈ 5 రోజులు జాగ్రత్త.. హెచ్చరించిన వాతావరణశాఖ
telangana temperatures
telangana temperatures

Telangana Weather Alert : మార్చి మొదలైందో లేదో.. ఎండలు మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి, ఉక్కపోత పెరిగాయి. ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లు నిర్విరామంగా తిరుగుతూనే ఉంటున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరిగింది. వేసవి వస్తుందంటేనే ప్రజల గుండెల్లో దడ పుడుతోంది. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయి. అధిక వేడి, ఉక్కపోతతో ఎలా వేసవిని దాటాలా అని కంగారు పడుతున్నారు. మార్చి మొదలై మూడ్రోజులైనా కాకుండానే.. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటగా.. అత్యధికంగా సిద్ధిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read More : ముక్కు, గొంతు, చెవులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, ఖమ్మం జిల్లా మధిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా.. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఇప్పుడు కునుకు పట్టని పరిస్థితి ఉంది. ఇక మున్ముందు ఈ ఎండల తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి.

వేసవి తాపం దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. పిల్లలు, వృద్ధులను అత్యవసరమైతే తప్ప బయటకు తీసుకెళ్లొద్దని సూచించారు. అలాగే రోజుకు 5-6 లీటర్ల నీరు తాగాలి. ముఖ్యంగా శీతల పానీయాల జోలికి వెళ్లొద్దు. పిల్లలకు కూడా కూల్ డ్రింక్స్ అలవాటు చేయకపోవడం మంచిది. వీలైనంత వరకూ మట్టికుండలో నీటిని తాగండి. చలువ చేసే కూరగాయలు, ఇతర పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోండి.

Tags

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×