E-Paper
Advertisement

kejriwal: కవితలా వదిలేస్తారా? సిసిడియాలా అరెస్ట్ చేస్తారా? కేజ్రీవాల్ ఫ్యూచరేంటి?

kejriwal: కవితలా వదిలేస్తారా? సిసిడియాలా అరెస్ట్ చేస్తారా? కేజ్రీవాల్ ఫ్యూచరేంటి?
Advertisement

kejriwal: డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశారు. ఇప్పుడు సీఎంను కార్నర్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూసుకుపోతుంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. లిక్కర్ పాలసీ రూపొందించిన విధానం.. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు.. ఇలా అన్ని కోణాల్లో పలురకాల ప్రశ్నలు సంధించింది. విచారణను ఆడియో, వీడియోలో రికార్డు చేశారు. కేజ్రీవాల్ నుంచి రాతపూర్వక స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అయితే, ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది సీబీఐ.

విచారణ తర్వాత సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. దర్యాప్తు సంస్థ తీరుపై మండిపడ్డారు. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని.. తనను 56 ప్రశ్నలు అడిగారని.. మళ్లీ విచారణకు రమ్మని పిలువలేదని చెప్పారు. ఆప్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నారని.. ప్రాణం పోయినా నీతి తప్పనన్నారు అర్వింద్ కేజ్రీవాల్.

Advertisement

దర్యాప్తు సంస్థలు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అంతుచిక్కడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆమెను మూడు సార్లు ప్రశ్నించి వదిలేశారు. వరుసగా రెండురోజులు సుదీర్ఘంగా విచారించారు. కవిత ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటా రికవరీ చేసి పరిశీలించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత రోల్‌ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్సే.

అదే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విషయంలో అలా జరగలేదు. ఇలా పిలిచారు.. అలా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచీ జైల్లోనే ఉంచారు. బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఇదే కేసులో.. సిసోడియా అరెస్ట్.. ప్రస్తుతానికైతే కవిత, కేజ్రీవాల్ సేఫ్. మరి, ముందుముందు?

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×