BigTV English

Nirmal District: బిర్యానీ కోసమని వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5లక్షలు దొబ్బేశారు..

Nirmal District: బిర్యానీ కోసమని వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5లక్షలు దొబ్బేశారు..

Nirmal District News: రోజు రోజుకీ రాష్ట్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో పట్ట పగలే స్కూటీ డిక్కీ నుంచి రూ.5లక్షలను దొంగలించారు. స్క్రూ డ్రైవర్ తో డిక్కీ తెరిచి డబ్బులతో అక్కడ నుంచి పరార్ అయ్యారు. సీసీ టీవీలో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.


నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని హెడ్బిట్ గ్రామానికి చెందిన బాంబోతుల ఆనంద్ ఆనంద్ అనే వ్యక్తి ఈ రోజు బ్యాంక్ నుంచి రూ.5లక్షలు డ్రా చేశారు. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో బార్ అండ్ రెస్టారంట్ వద్ద ఆగారు. అలా లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి నగదు మాయమైంది. ఘటన ఒక్కసారిగా భైంసా పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ALSO READ: Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షపాతం.. ఈ ఏడాదిలోనే రికార్డు, ఆ ప్రాంతంలో ఏకంగా 151 మీమీ


అమెరికాలో ఉన్న కూతరు, తండ్రి కోసమని డబ్బులు పంపింది. దీంతో ఆనంద్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. అయితే స్కూటీ డిక్కీలో డబ్బుల కట్టులు పెట్టుకుని అతను ఇంటికి పయనం అయ్యారు. అయితే భోజనం కోసం అని ఆనంద్ ఓ రెస్టారెంట్ వద్ద ఆగాడు. అయితే, ఓ వ్యక్తి అతడిని ఫాల్లో అయ్యాడు. ఆనంద్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడం.. డిక్కీలో డబ్బులు పెట్టుకోవడం తతాంగాన్ని అంతా గమనించుకుంటూనే ఉన్నాడు.

ALSO READ: Guvvala Balaraju: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..

అయితే.. సరిగ్గా ఆనంద్ రెస్టారెంట్ లో భోజనం చేసి బయటకు వచ్చే వరకే నగదు మాయమైంది. నిందితుడు స్క్రూ డ్రైవర్ తో డిక్కీని ఓపెన్ చేసి రూ.5 లక్షలను దొంగలించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. బాధిత వ్యక్తి వెంటనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత వ్యక్తి ఆనంద్ కు భరోసా ఇచ్చారు.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×