E-Paper
Advertisement

Nirmal District: బిర్యానీ కోసమని వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5లక్షలు దొబ్బేశారు..

Nirmal District: బిర్యానీ కోసమని వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5లక్షలు దొబ్బేశారు..
Advertisement

Nirmal District News: రోజు రోజుకీ రాష్ట్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో పట్ట పగలే స్కూటీ డిక్కీ నుంచి రూ.5లక్షలను దొంగలించారు. స్క్రూ డ్రైవర్ తో డిక్కీ తెరిచి డబ్బులతో అక్కడ నుంచి పరార్ అయ్యారు. సీసీ టీవీలో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని హెడ్బిట్ గ్రామానికి చెందిన బాంబోతుల ఆనంద్ ఆనంద్ అనే వ్యక్తి ఈ రోజు బ్యాంక్ నుంచి రూ.5లక్షలు డ్రా చేశారు. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో బార్ అండ్ రెస్టారంట్ వద్ద ఆగారు. అలా లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి నగదు మాయమైంది. ఘటన ఒక్కసారిగా భైంసా పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Advertisement

ALSO READ: Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షపాతం.. ఈ ఏడాదిలోనే రికార్డు, ఆ ప్రాంతంలో ఏకంగా 151 మీమీ

అమెరికాలో ఉన్న కూతరు, తండ్రి కోసమని డబ్బులు పంపింది. దీంతో ఆనంద్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. అయితే స్కూటీ డిక్కీలో డబ్బుల కట్టులు పెట్టుకుని అతను ఇంటికి పయనం అయ్యారు. అయితే భోజనం కోసం అని ఆనంద్ ఓ రెస్టారెంట్ వద్ద ఆగాడు. అయితే, ఓ వ్యక్తి అతడిని ఫాల్లో అయ్యాడు. ఆనంద్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడం.. డిక్కీలో డబ్బులు పెట్టుకోవడం తతాంగాన్ని అంతా గమనించుకుంటూనే ఉన్నాడు.

Advertisement

ALSO READ: Guvvala Balaraju: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..

అయితే.. సరిగ్గా ఆనంద్ రెస్టారెంట్ లో భోజనం చేసి బయటకు వచ్చే వరకే నగదు మాయమైంది. నిందితుడు స్క్రూ డ్రైవర్ తో డిక్కీని ఓపెన్ చేసి రూ.5 లక్షలను దొంగలించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. బాధిత వ్యక్తి వెంటనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత వ్యక్తి ఆనంద్ కు భరోసా ఇచ్చారు.

Related News

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Big Stories

Advertisement
×