E-Paper
Advertisement

Security : ఈటలకు Y+, అర్వింద్ కు Y కేటగిరి.. బీజేపీ నేతలకు భద్రత పెంపు..

Security : ఈటలకు Y+, అర్వింద్ కు Y కేటగిరి.. బీజేపీ నేతలకు భద్రత పెంపు..

BJP News Telangana(Latest political news telangana) : తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ కు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పిస్తాయి. ఈట‌లకు Y +, అర్వింద్‌కు Y కేటగిరి భద్రత కల్పించారు. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీగా ఉంటాయి. అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి.

ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం Y + కేటగిరి భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన హత్యకు ప్లాన్‌ జరుగుతోందని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఈటలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించారు.

ఇప్పటికే ఐబీ టీమ్, స్టేట్ ఇంటెలిజెన్స్ టీమ్, జాయింట్ రివ్యూ మీటింగ్ లో పాల్గొని.. వ్యక్తిగత వివరాలతోపాటు అర్వింద్ ఆఫీస్, నివాసం దగ్గర్లోని పరిసర ప్రాంతాల ఫొటోలను సేకరించారు. అర్వింద్ వెంట పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సహా, స్పెషల్ గార్డులు నియమిస్తారు. ఆయన నివాసం దగ్గర ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఒక గార్డ్ కమాండర్ ఉంటారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×