E-Paper
Advertisement

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..
Advertisement

Delhi Crime : నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. హత్య చూసిన స్థానికులు వణికిపోయారు. యువతి హత్యకేసుకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పవన్ నిషద్ అనే యువకుడు మూడేళ్ల క్రితం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో పవన్ అరెస్టై జైలుకెళ్లాడు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని అతని సోదరులు అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. కానీ యువతి కుటుంబం వారి బెదిరింపులకు లొంగలేదు. పవన్ సోదరుడు అశోక్ నిషద్ మరో కేసులో జైల్లో ఉండగా.. ఇటీవలే ఇద్దరూ బయటికొచ్చారు. పవన్ పై ఉన్న అత్యాచార కేసును వెనక్కి తీసుకునే విషయంలో యువతి కుటుంబంతో మరోసారి ఘర్షణ జరిగింది.

Advertisement

కేసు వెనక్కి తీసుకోబమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పశువులను కాసుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతిని అడ్డుకుని.. నడిరోడ్డుపై వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పవన్, అశోక్ లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కౌశాంబి జిల్లా ఎస్పీ తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×