E-Paper
Advertisement

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. హత్య చూసిన స్థానికులు వణికిపోయారు. యువతి హత్యకేసుకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పవన్ నిషద్ అనే యువకుడు మూడేళ్ల క్రితం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో పవన్ అరెస్టై జైలుకెళ్లాడు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని అతని సోదరులు అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. కానీ యువతి కుటుంబం వారి బెదిరింపులకు లొంగలేదు. పవన్ సోదరుడు అశోక్ నిషద్ మరో కేసులో జైల్లో ఉండగా.. ఇటీవలే ఇద్దరూ బయటికొచ్చారు. పవన్ పై ఉన్న అత్యాచార కేసును వెనక్కి తీసుకునే విషయంలో యువతి కుటుంబంతో మరోసారి ఘర్షణ జరిగింది.

కేసు వెనక్కి తీసుకోబమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పశువులను కాసుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతిని అడ్డుకుని.. నడిరోడ్డుపై వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పవన్, అశోక్ లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కౌశాంబి జిల్లా ఎస్పీ తెలిపారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×