BigTV English

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. హత్య చూసిన స్థానికులు వణికిపోయారు. యువతి హత్యకేసుకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


పవన్ నిషద్ అనే యువకుడు మూడేళ్ల క్రితం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో పవన్ అరెస్టై జైలుకెళ్లాడు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని అతని సోదరులు అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. కానీ యువతి కుటుంబం వారి బెదిరింపులకు లొంగలేదు. పవన్ సోదరుడు అశోక్ నిషద్ మరో కేసులో జైల్లో ఉండగా.. ఇటీవలే ఇద్దరూ బయటికొచ్చారు. పవన్ పై ఉన్న అత్యాచార కేసును వెనక్కి తీసుకునే విషయంలో యువతి కుటుంబంతో మరోసారి ఘర్షణ జరిగింది.

కేసు వెనక్కి తీసుకోబమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పశువులను కాసుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతిని అడ్డుకుని.. నడిరోడ్డుపై వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పవన్, అశోక్ లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కౌశాంబి జిల్లా ఎస్పీ తెలిపారు.


Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×