E-Paper
Advertisement

Viral Video: అండర్ వేర్ లో కిలో బంగారం.. ఎయిర్ పోర్టులో అడ్డంగా బుక్కైన కిలేడీ!

Viral Video: అండర్ వేర్ లో కిలో బంగారం.. ఎయిర్ పోర్టులో అడ్డంగా బుక్కైన కిలేడీ!
Advertisement

Gold Smuggling:

విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. ఒక్కో వ్యక్తి చేసే ప్లాన్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. అలాంటి వ్యక్తుల ప్లాన్స్ అన్నీ బట్టబయలు చేస్తుంటారు ఎయిర్ పోర్టు అధికారులు. తాజాగా ఓ మహిళ ఏకంగా కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె ఆటలు సాగలేదు. అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది.

అండర్ వేర్ లో బంగారాన్ని దాచి..

అక్టోబర్ 24న మయన్మార్ నుంచి 8M-620 విమానంలో ఓ మహిళ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. టెర్మినల్ -3లోకి అడుగు పెట్టింది. ఎందుకో ఆమె వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. సదరు మహిళ తన లోదుస్తులలో దాచిపెట్టిన 1 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఆమె నల్లటి లో దుస్తులలో ఈ బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ఆరు బంగారు బిస్కెట్ల రూపంలో ఉన్నట్లు తెలిపారు. ఈ బంగారు మొత్తం 996.5 గ్రాముల బరువున్నట్లు వెల్లడించారు. ఈ గోల్డ్ విలువ సుమారు రూ. 1.17 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మయన్మార్ నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంగీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను జైలుకు పంపించారు.

Advertisement

Read Also:గన్నవరం ఎయిర్ పోర్టులో చెలరేగిన మంటలు.. కారణం ఏంటంటే?

బాటిల్ మూతలో 170 గ్రాముల బంగారం..

ఇక అక్టోబర్ 26న మరో విచిత్రమైన బంగారం అక్రమ రవాణా కేసు బయటపడింది. దుబాయ్ నుంచి AI-996 విమానంలో  వచ్చిన ఓ ప్రయాణీకుడు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. విమాన గేటు నుంచి అతనిని పర్యవేక్షిస్తున్న అధికారులు గ్రీన్ ఛానల్ ఎగ్జిట్ గేట్ దగ్గర అడ్డుకున్నారు. అతడి దగ్గర ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు స్కానింగ్ లో గుర్తించారు. వెంటనే, అతడిని పక్కకు తీసుకెళ్లి, లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి తెలివిని చూసి కస్టమ్స్ అధికారులు షాకయ్యారు. వాటర్ బాటిల్ మూతలో ఏకంగా 170 గ్రాముల బంగారాన్ని ఉంచినట్లు గుర్తించారు. తనిఖీల్లో ఆ బంగారాన్ని బాటిల్ క్యాప్ నుంచి బయటకు తీశారు. ఈ బంగారం విలు సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. అతడిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేసి, జైలుకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.

Advertisement

Read Also:  ఢిల్లీ విమానాశ్రయంలో మంటలు, కాలి బూడిదైన ఎయిర్ ఇండియా బస్సు!

 

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×