E-Paper
Advertisement

Bharat Gaurav Tourist Train: జస్ట్ రూ. 22 వేలకే 4 పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC క్రేజీ ప్యాకేజీ!

Bharat Gaurav Tourist Train: జస్ట్ రూ. 22 వేలకే 4 పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC క్రేజీ ప్యాకేజీ!
Advertisement

Bharat Gaurav Kashi Darshana:

తక్కువ ఛార్జీతో పుణ్యక్షేత్రాలు, పర్యటక ప్రాంతాలను చూసే టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తాజాగా భారత్ గౌరవ్ కాశీ దర్శనం పేరుతో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం, IRCTCతో కలిసి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ‘కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శనం’ థీమ్ తో తీర్థయాత్ర పర్యటనను అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా, యాత్రికులు నాలుగు ప్రముఖ పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. వారణాసి, గయ, అయోధ్య, ప్రయాగ్‌ రాజ్ ను దర్శించుకుంటారు. మొత్తం ప్రయాణం 9 రోజులు కొనసాగే ఈ యాత్ర అక్టోబర్ 5 ప్రారంభం కానుంది.

ప్యాకేజీలో భాగంగా దర్శించుకునే పుణ్యక్షేత్రాలు

⦿ వారణాసి: తులసి మానస్ ఆలయం, సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, గంగా హారతి దర్శనం ఉంటుంది.

Advertisement

⦿ అయోధ్య: రామ జన్మభూమి ఆలయ సందర్శనం ఉంటుంది.

⦿ గయ: విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం దర్శించుకోవచ్చు.

Advertisement

⦿ ప్రయాగ రాజ్: హనుమాన్ ఆలయం, గంగానదిలో పవిత్ర స్నానం చేయవచ్చు.

IRCTC టూరిజం ప్రకారం.. పవిత్ర స్నానం, గంగా హారతి నీటి స్థాయి ఆధారంగా సాధ్యాసాధ్యాలకు లోబడి ఉంటాయి.

భారత్ గౌరవ్ కాశీ దర్శనం బోర్డింగ్, డీబోర్డింగ్ స్టేషన్లు

భారత్ గౌరవ్ కాశీ దర్శనం యాత్ర యశ్వంత్‌ పూర్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది.  యాత్రికులు తుమకూరు, బిరూర్, దావణగెరె, హవేరి, హుబ్బళ్లి,  బెల్గాంలలో రైలు ఎక్కడానికి అనుమతి ఉంటుంది.

భారత్ గౌరవ్ కాశీ దర్శనం ప్యాకేజీ వివరాలు

భారత్ గౌరవ్ కాశీ దర్శనం ప్రయాణం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ పర్యటనకు ఒక్కొక్కరికి రూ. 22,500 ఛార్జ్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 7,500 ప్రత్యేక సబ్సిడీని అందిస్తోంది.

⦿ కాశీ దర్శనం కోసం వెళ్లే యాత్రికులకు భారత్ గౌరవ్ ప్రత్యేక రైలులో 3AC తరగతిలో ప్రయాణ అవకాశం ఉంటుంది.

⦿ నాన్  ఏసీ హోటళ్లలో ట్విన్/ట్రిపుల్ షేర్‌ లో రాత్రి బసలు అందించబడతాయి.

⦿ అన్ని భోజనాలు (వెజ్ మాత్రమే) ఉచితంగా అందిస్తారు.

⦿ నాన్ ఏసీ బస్సులలో దర్శనాలు, రవాణా సౌకర్యం ఉంటుంది.

⦿ ప్రయాణీకులకు ప్రయాణ బీమా కల్పిస్తారు.

Read Also: అమెరికా షట్ డౌన్, విమానాలు, వీసాలపై ఎఫెక్ట్ ఉంటుందా?

భారత్ గౌరవ్ కాశీ దర్శనం ప్యాకేజీ మినహాయింపులు

బోటింగ్, అడ్వెంచర్ గేమ్స్, నిర్ణయించిన ఫుడ్ కాకుండా ఇతర ఫుడ్స్ కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సందర్శనా స్థలాల ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, స్థానిక గైడ్‌ సేవలకు అదనంగా ఛార్జ్ చేస్తారు.  మెనూలలో లేని లాండ్రీ ఖర్చులు, వైన్లు, మినరల్ వాటర్, ఆహారం, పానీయాలు లాంటివి యాత్రికులే భరించాల్సి ఉంటుంది.

Read Also:  డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×