Bogatha Waterfall: ములుగు జిల్లా వాజేడు ఫారెస్ట్లో ఉన్న బొగత జలపాతం ఇప్పుడు కొత్త గ్లామర్తో మెరిసిపోతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు చెక్ డ్యామ్లు, వాగులు పొంగిపొర్లుతుండటంతో.. ఆ వాటర్ ఫ్లో అంతా బొగతనే తాకుతోంది. దాంతో ఈ వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. సుమారు 50 ఫీట్ల హైట్ నుంచి హోరెత్తే సౌండ్తో ఉరకలేస్తున్న ఆ దృశ్యాలు మైమరిపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ వ్యూ ఒక విజువల్ ట్రీట్లా మారింది.
క్యూ కట్టిన ఫ్యామిలీచే..
మూడు రోజులు వరుస హాలిడేస్ రావడంతో జనాలు ఫ్యామిలీస్తో కలిసి ఇటువైపు క్యూ కట్టారు. చుట్టూ పచ్చని అడవి.. మధ్యలో తెల్లటి నురగలతో ఉప్పొంగుతున్న వాటర్.. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసి ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లకుండా కింద ఉన్న పూల్లో జలకాలాటలు ఆడుతూ రిలాక్సవుతున్నారు. యంగ్స్టర్స్ అయితే బెస్ట్ లొకేషన్స్ వెతుక్కుంటూ క్రేజీగా సెల్ఫీలు, రీల్స్తో రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు!
బొగత జలపాతం వద్ద అధికారుల ప్రకటన..
వాటర్ ఫ్లో మరీ టూమచ్గా ఉండటంతో బొగత దగ్గర అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకునేవారికి బొగత ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని అంటున్నారు టూరిస్టులు. పర్యాటకులు ఎవరూ వాటర్ దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాక్సిడెంట్స్ జరగకుండా అటవీశాఖ సిబ్బంది స్పాట్లోనే ఉండి గస్తీ కాస్తున్నారు.
సెలవుదినమైన ఆదివారం నాడు ప్రసిద్ధ బొగత జలపాతం పర్యాటకులతో కిటకిటలాడింది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు జలపాత దృశ్యాలను తిలకిస్తూ, స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ రోజంతా ఆనందంగా గడిపారు. pic.twitter.com/ZijGphKyDz
— BigTV APP (@BigtvApp) August 9, 2026