BigTV English

Blast on Railway Track: ట్రాక్ పై బాంబు పేలుడు, రైల్వే సర్వీసులు బంద్!

Blast on Railway Track: ట్రాక్ పై బాంబు పేలుడు, రైల్వే సర్వీసులు బంద్!
Advertisement

IED Blast On Railway Tracks:

అస్సాంలో గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే పట్టాలను ధ్వంసం చేశారు. కోక్రాజర్ జిల్లాలోని రైల్వే ట్రాక్ పై అనుమానిత ఇంప్రూవైజ్డ్ పేలుడు డివైజ్(IED) పేల్చారు. ఈ ఘటనతో ఉత్తర బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలో రైల్వే సేవలు నిలిచిపోయాయి. రాత్రి సమయంలో సలకటి వైపు వెళ్లే మార్గంలో కోక్రాజర్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా దాదాపు మూడు అడుగుల రైల్వే లైన్‌ ధ్వంసం అయినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న ట్రాక్ శకలాలు దూరంగా ఎగిరి పడ్డట్లు తెలిపారు.


అటు ఈ ఘటనపై కోక్రజర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పుష్పరాజ్ సింగ్ స్పందించారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. రైల్వే పట్టాలు మాత్రం ధ్వంసం అయినట్లు వివరించారు.  “ట్రాక్ కొద్ది భాగం దెబ్బతిన్నది. దానిని కొద్ది గంటల్లోనే మర్మతులు చేశారు. ఇప్పుడు రైలు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి” అని ఆయన వెల్లడించారు.

రాత్రిపూట రైల్వే సర్వీసుల నిలిపివేత

అటు ఈ ప్రమాదం తర్వాత రాత్రిపూట రైలు సర్వాసులు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోయర్ అస్సాం, ఉత్తర పశ్చిమ బెంగాల్‌ లోని అనేక అప్ అండ్ డౌన్ రైళ్లు ఉదయం 8 గంటల వరకు నిలిచిపోయాయన్నారు. రైల్వే, భద్రతా సిబ్బంది ప్రభావిత విభాగంలోక్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత మళ్లీ రైల్వే సేవలు మొదలు పెట్టినట్లు వివరించారు. ఆ మార్గంలో రైల్వే ట్రాక్ లను పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నట్లు తెలిపారు.


నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం

అటు ఈ పేలుడుకు పాల్పడిన వారిని పట్టుకునేందకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ పేలుడు పాల్పడింది ఎవరై ఉంటారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అలీపుర్దువార్ డివిజన్ పరిధిలోని కోక్రాజర్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని వెల్లడించారు. “సలకతి, కోక్రజర్ మధ్య గూడ్స్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు, రైలు మేనేజర్ భారీ కుదుపును గుర్తించాడు.  ఆ తర్వాత రైలు ఆగిపోయింది. తనిఖీ చేస్తున్నప్పుడు, అనుమానిత బాంబు పేలుడు కారణంగా ట్రాక్,  స్లీపర్‌ లు ధ్వంసం అయ్యాయని తేలింది. రాష్ట్ర పోలీసులు, రైల్వే రక్షణ దళం (RPF), నిఘా అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 5.25 గంటలకు ట్రాక్ పునరుద్ధరించబడింది. సాధారణ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సంఘటన కారణంగా సుమారు ఎనిమిది రైళ్లను నిలిపివేశారు” అని ఆయన తెలిపారు. సంఘటన తర్వాత, ఆ విభాగంలో పెట్రోలింగ్ ముమ్మరం చేయబడిందని వివరించారు. త్వరలోనే ఘటనకు కారణం అయినవారిని పట్టుకుంటామని శర్మ వెల్లడించారు.

Read Also: ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

Flight Ticket: జస్ట్ రూపాయికే విమాన టికెట్, ఇండిగో అదిరిపోయే ఆఫర్!

IRCTC Tickets: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Watch Video: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!

Viral Video: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..

Zip-lining In Hyderabad: హైదరాబాద్ లో అడ్వెంచర్ స్పాట్.. జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్ ఎంజాయ్ చేయండి!

Fuel Leaks in Flight: విమానం గాల్లో ఉండగా ఫ్యూయెల్ లీక్..భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!

Ajanta Express: మెదక్ లో అకస్మాత్తుగా ఆగిపోయిన అజంతా ఎక్స్‌ ప్రెస్, గంటల తరబడి ప్రయాణీకుల అవస్థలు!

Big Stories

×