E-Paper
Advertisement

వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!

వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!

New Motor Vehicle Rules: వాహనాలపై కులం, మతం, ఇతరులను రెచ్చగొట్టేలా ఉండే స్టిక్కర్లు, రాతలు రాయడం మానుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇలాంటి చర్యలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందన్నారు.  ముఖ్యంగా నంబర్ ప్లేట్ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. నంబర్ ప్లేట్‌ పై రిజిస్ట్రేషన్ నంబర్ తప్ప మరే ఇతర పదాలు, గుర్తులు, స్టిక్కర్లు ఉండకూడదు.

రూ. 10 వేల వరకు జరిమానా

నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు వెల్లడించారు. మొదటిసారి పట్టుబడితే రూ.5,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. అదే తప్పును మళ్లీ చేస్తే రూ.10,000 వరకు జరిమానా పెరగడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశమూ ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో వాహనాలపై కులం పేర్లు రాయడం వల్ల సామాజిక ఘర్షణలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. చిన్న చిన్న విషయాలకే వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మొదట ఉత్తరప్రదేశ్‌లో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ప్రారంభించగా,  ఆ తర్వాత హర్యానాలో కూడా ఇలాంటి రాతలను పూర్తిగా నిషేధించారు.

MVC సెక్షన్ 177 కింద కేసులు

వాహనాలపై కులం, వివాదాస్పద నినాదాలు రాస్తే శిక్షార్హం అవుతుంది. వాహనంపై అలాంటి రాతలు ఉన్నా, నంబర్ ప్లేట్‌ పై సంఖ్య తప్ప మరేదైనా కనిపించినా జరిమానా తప్పదు. అవసరమైతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 కింద కేసులు కూడా నమోదు చేస్తారు. వెహికల్ బాడీపై కూడా కులం, మతానికి సంబంధించిన గుర్తులు పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు. రూ.1,000 నుంచి రూ.2,500 వరకు జరిమానా విధించవచ్చు. పరిస్థితిని బట్టి పోలీసులు వాహనాన్ని సీజ్ చేసే అవకాశమూ ఉంటుంది.

మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెప్తుందంటే?

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం నంబర్ ప్లేట్ స్పష్టంగా ఉండాలి. కేవలం వాహన నంబర్ మాత్రమే కనిపించాలి. ఇది ట్రాఫిక్ నియంత్రణకు, నేరాలలో ఉపయోగించిన వాహనాలను సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండాలి. అనవసరమైన స్టిక్కర్లు, రాతలు ఉంటే వాహనాన్ని గుర్తించడం కష్టమవుతుంది. వాహనాలపై కులం, మతం పేర్లు ప్రదర్శించడం వల్ల అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. వాటిని ముందుగానే అరికట్టేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

సో, ఇకపై మీ వాహనంపై ఇలాంటి స్టిక్కర్లు, రాతలు ఉంటే వెంటనే తొలగించడం మంచిది. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసినప్పుడు జరిమానా మాత్రమే కాకుండా వాహనం సీజ్ అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. వాహనంపై ఏదైనా రాయించుకునే ముందు చట్టాలను గుర్తుంచుకోవడం అవసరం. నియమాలను పాటిస్తే అనవసరమైన ఇబ్బందులను సులభంగా తప్పించుకోవచ్చు.

Read Also: వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×