BigTV English
Advertisement

Durga Puja Mandapam: అంగ్కోర్ వాట్ ఆలయంలా దుర్గా దేవి మండపం, ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Durga Puja Mandapam: అంగ్కోర్ వాట్ ఆలయంలా దుర్గా దేవి మండపం, ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Ranchi Durga Puja Mandapam:

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా బక్రి బజార్ లోని అమ్మవారి మండపం నిర్మాణం దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి ఏటా ఒక్కో ఆలయ రూపంలో ఇక్కడి మండపాన్ని నిర్మిస్తారు. ఈ మండపం నిర్మాణం కోసం నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాత శిల్పులను తీసుకొచ్చి ఈ మండపం నిర్మాణం, అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయిస్తారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా దుర్గా పూజ దగ్గర పడుతుండటంతో మండపం నిర్మాణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది.


అంగ్కోర్ వాట్ ఆలయంలా..

రాంచీ బక్రి బజార్‌ లో తయారు చేస్తున్న పూజ మండపం ఈసారి భక్తులను మరింత ఆకట్టుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయమైన కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం తరహాలో పండల్‌ను రెడీ చేస్తున్నారు. భారతీయ యువక్ సంఘ్ బక్రి బజార్ అధ్యక్షుడు రాహుల్ అగర్వాల్ పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ మంపడపం అధికారిక ప్రారంభోత్సవం సెప్టెంబర్ 26న జరుగుతుంది. దాదాపు 14, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మండపం సిద్ధం అవుతోంది. బక్రి బజార్‌ లో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద మండపంగా ఇది గుర్తింపు తెచ్చుకోనుంది. పూజ మండపం నిర్మాణంలో అన్ని సహజ వస్తువులను ఉపయోగించారు. పాత్ కాథి, మలై కాథి, హోగ్లా ఆకు, తాటి ఆకు, బూలెన్ తాడు, త్రిపుర చాప, త్రిపుర మదుర్ కాథి, ఇతర వస్తువులు ఉన్నాయి.

3 నెలలుగా కొనసాగుతున్న మండప నిర్మాణం

దుర్గా పూజ మండపం నిర్మాణం దాదాపు మూడు నెలలుగా కొనసాగుతోంది. దీనిలో దుర్గా మాత విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్‌ కు చెందిన అనుప్ దా తయారు చేస్తున్నారు. విగ్రహం వెడల్పు 36 అడుగులు, ఎత్తు దాదాపు 26 అడుగులు ఉంటుందని పూజీ కమిటీ సభ్యుడు సంజయ్ కుమార్ తెలిపారు.  రాష్ట్రపతి అవార్డు గ్రహీత కళాకారుడు గోరంగో కోయెలి దుర్గాపూజ మండప నిర్మాణాన్ని చూసుకుంటున్నారు.


Read Also: హైదరాబాద్‌ నుంచి కేవలం 8 గంటల జర్నీ.. స్వర్గాన్ని తలపించే ఈ ఆలయానికి వెళ్లాలని ఉందా?

రూ. 90 లక్షల ఖర్చుతో.. 110 అడుగుల ఎత్తులో..

దుర్గా పూజా మండపం ఎత్తు దాదాపు 110 అడుగులు ఉంటుంది. మండపం పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ గా నిర్మిస్తున్నారు. పూజ మండపానికి ఈసారి సుమారు రూ. 90 లక్షలు ఖర్చు చేస్తున్నారు. రాజమౌళి సినిమా సెట్టింగును తలపించే రూపొందిస్తున్నారు. ఇది ప్రజల నుంచి సేకరించిన విరాళాల ద్వారా నిర్మిస్తున్నారు. మండపాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా బాధ్యతను స్థానిక పరిపాలన, పూజ కమిటీతో అనుబంధించబడిన స్వచ్ఛంద సేవకులు తీసుకుంటారు. మొత్తంగా ఈసారి రాంచీ బక్రి బజార్ లో దుర్గాదేవి పూజ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

Read Also: అక్కడ రైళ్లు ఆకాశాన్ని తాకుతాయి, అమ్మో ఆ స్టేషన్ అంత ఎత్తులో ఉందా?

Related News

Railway Station: రైల్వే స్టేషన్ లో యువకుడి పైత్యం, అందరూ చూస్తుండగా మూత్ర విసర్జన, వీడియో వైరల్!

Ayyappa Swamy Temple: గోదావరి తీరంలో అద్భుతమైన అయ్యప్ప ఆలయం.. రాజమండ్రికి వెళ్తే అస్సలు మిస్సవకండి!

Hyd Metro Timings: కోచ్ లు పెంచకపోగా ఉన్న టైమ్ తగ్గిస్తారా? హైదరాబాద్ మెట్రోపై ప్రయాణీకుల ఆగ్రహం!

Railways Reservation Closed: రైల్వే టికెట్లు బుక్ చెయ్యడం కష్టమే.. ఎప్పటి వరకు అంటే?

IRCTC Andaman Tour: ఐఆర్‌సిటిసి స్పెషల్ ప్యాకేజ్‌.. ఒకసారి తప్పక వెళ్లాల్సిన అందమాన్ దీవుల యాత్ర

Hyd Metro Timings Revised: మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?

Viral Video: రైలులో వాటర్ బాటిల్ ధర రూ.500.. అమృతం గానీ అమ్ముతున్నారా ఏంటీ?

Boarding Flight: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!

Big Stories

×