E-Paper
Advertisement

Hyderabad tourism: హైదరాబాద్ కి హైవే కాదు.. రోప్‌వే వస్తోంది! ఎక్కడంటే?

Hyderabad tourism: హైదరాబాద్ కి హైవే కాదు.. రోప్‌వే వస్తోంది! ఎక్కడంటే?
Advertisement

Hyderabad tourism: ఇదిగో హైదరాబాద్ కు మరో గర్వకారణం ఏర్పాటవుతోంది. చరిత్రను తాకేలా, భవిష్యత్తును అనుభవించేలా.. గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ సమాధుల దాకా విమాన ప్రయాణంలా రోప్‌వే సౌకర్యం రాబోతోంది. ఇంతకీ ఇది కేవలం ప్రయాణమే కాదు.. ఏకకాలంలో చారిత్రక స్పృహను, ఆధునిక పరిష్కారాలను మిళితం చేసే ప్రయోగం. భూమిపై ట్రాఫిక్ కష్టాలు, పార్కింగ్ సమస్యలు ఉంటే.. ఇప్పుడు వాటికి మార్గం గాలిలో దొరుకుతోంది!

హైదరాబాద్ తన చారిత్రక వారసత్వాన్ని కొత్త కోణంలో అనుభవించేందుకు సిద్ధమవుతోంది. తొలిసారిగా నగరంలో రోప్‌వే ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రసిద్ధ చారిత్రక స్థలాలైన గోల్కొండ కోట, కుతుబ్ షాహి సమాధులను కలుపుతూ రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ బైడైరెక్షనల్ రోప్‌వే సర్వీస్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యిన తర్వాత, ఇరువైపు సందర్శకులు కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే గమ్యాన్ని చేరవచ్చు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో ఇది 15 నుండి 20 నిమిషాలు పడుతోంది.

Advertisement

హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (HUMTA) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి. జీవన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్ తయారీ, వ్యయ అంచనాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఆగస్టు 8 చివరి తేదీగా ప్రకటించారు. రోప్‌వేను ఆధునిక కేబుల్ కార్లతో రూపొందించబోతున్నారు. ఒక్కో కేబుల్ కార్‌లో ఆరుగురు ప్రయాణికులు ప్రయాణించగలుగుతారు. ఇది కేవలం ప్రయాణ మార్గమే కాకుండా, నగరానికి కొత్త విజువల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం గోల్కొండ కోట, కుతుబ్ షాహి సమాధులను రోజుకు సగటున 5,000 నుండి 8,000 మంది సందర్శిస్తున్నారు. వీకెండ్‌లో ఇది 10,000 దాటుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రోప్‌వే ద్వారా సందర్శకుల సంఖ్య మరింత పెరగనుంది. శిమ్లా, ధర్మశాలా, మనాలీ వంటి టూరిజం హబ్‌లలో ఇప్పటికే ఉన్న రోప్‌వే మోడల్‌ను ఆధారంగా తీసుకొని, హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో అమలు చేయనున్నారు. Ropeway Rapid Transport System Development Corporation (RTDC) ఇటువంటి ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తోంది.

Advertisement

ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పబ్లిక్ – ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌ ద్వారా నిర్మించనున్నారు. అంటే ప్రైవేట్ పెట్టుబడిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి జరుగుతుంది. మొదటి దశలో రెండు కేబుల్ కార్లను నడిపిస్తారు. ప్రయాణికుల స్పందన, టూరిజం డిమాండ్‌ను బట్టి వాటిని పెంచే అవకాశం ఉంది. రోప్‌వే ప్రారంభం తర్వాత గోల్కొండ ఫోర్ట్ ఎంట్రెన్స్ వద్ద ఒక టర్మినల్, కుతుబ్ షాహి సమాధుల వద్ద మరొకటి నిర్మిస్తారు. ఈ రెండు heritage points మధ్య భారీ టవర్లను నిర్మించి, కేబుల్స్ ద్వారా కేబుల్ కార్లను నడిపిస్తారు.

Also Read: Train Dirty Photo: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. ఇదేం ట్రైన్, అదేం చెత్తరా బాబు!

ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలే కాదు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు కూడా అందుతుంది. narrow streets ఉన్న ప్రాంతాల్లో రోడ్లు విస్తరించలేని పరిస్థితిలో రోప్‌వే ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడంతో పాటు పార్కింగ్ సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతిస్తున్నారని సమాచారం.

జాతీయ స్థాయిలో చూస్తే, ఇదే తరహా ప్రాజెక్టు తెలంగాణలోని భువనగిరి కోట వద్ద 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రోగ్రామ్ కింద రూ. 50 కోట్ల కేటాయింపుతో ఆ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఈ నూతన ప్రాజెక్టులతో రాష్ట్రం టూరిజంలో మరింత ముందడుగు వేయనుంది.

హైదరాబాద్ నగరానికి ఇది ఒక బిగ్ బూస్ట్‌గా పరిగణించవచ్చు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గోల్కొండ కోట, కుతుబ్ షాహి సమాధులకు విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని అంచనా. అంతేకాకుండా, సిటీ ట్రాన్స్‌పోర్ట్‌లో సాంకేతికతను వినియోగించడంలో ఇది ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తోంది.

ఇటువంటి రోప్‌వే ప్రాజెక్ట్‌లు పర్యాటక ఆకర్షణలతోపాటు చరిత్రను సజీవంగా నిలుపుతూ, ఆధునికీకరణ దిశగా నగరాన్ని ముందుకు నడిపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో feasibility report పూర్తవుతుందనీ, ఆ వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నది అధికారుల లక్ష్యం.

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×