E-Paper
Advertisement

Indian Railways: రైలు ఒక నిమిషం ఆగితే రైల్వేకు ఇంత నష్టమా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

Indian Railways: రైలు ఒక నిమిషం ఆగితే రైల్వేకు ఇంత నష్టమా? మీరు అస్సలు ఊహించి ఉండరు!
Advertisement

మీరు వెళ్లాల్సిన రైలు జీవితం కాలం లేటు అంటూ గతంలో చాలా మంది భారతీయ రైల్వే మీద జోకులు వేసుకునే వాళ్లు. ఏ రైలూ చెప్పిన సమయానికి రాదంటూ నిట్టూర్చే వాళ్లు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా పద్దతి పూర్తిగా మారింది. రైళ్లు టైమ్ టేబుల్ ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి. అనుకున్న సమయానికి బయల్దేరడంతో పాటు నిర్ణీత సమయానికి గమ్యస్థానికి చేరుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో రైలు రావాల్సిన సమయం కంటే కొద్ది నిమిషాలు, లేదంటే కొన్ని గంటలు ఆలస్యం అవుతాయి. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం, ఏవైనా ప్రమాదాలు జరగడం, ఇంకా ఇతర కారణాల వల్ల రైళ్లు ఆయా స్టేషన్లలో ఆపేస్తారు.

రైల్వే మీద భారీగా ఆర్థిక భారం

Advertisement

రైళ్లు పలు కారణాలతో ఆగడం వల్ల రైల్వే సంస్థ మీద అధికంగా భారం పడుతుంది. నిమిషానికి ఒక్కో రైలుకు వేల రూపాయలు నష్టం వాటిళ్లుతుంది. ప్యాసింజర్ రైళ్లతో పోల్చితే, గూడ్స్ రైళ్లకు నష్టం కాస్త తక్కువగానే ఉంటుంది. ఇంతకీ ఒక నిమిషం పాటు రైలు ఆగడం వల్ల ఎంత నష్టం వాటిళ్లుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నిమిషం రైలు ఆగితే ఎంత నష్టం కలుగుతుంది?

Advertisement

రైలు ఒక్క నిమిషం పాటు ఆగడం వల్ల రైల్వే సంస్థకు వేల రూపాయాల్లో నష్టం కలుగుతుంది. ఈ నష్టం డీజిల్, విద్యుత్ కు వేర్వేరుగా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ ప్యాసింజర్ రైలు నిమిషం ఆగితే రైల్వే శాఖకు సుమారు రూ. 20,401 నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. విద్యుత్ తో నడిచే రైళ్లు నిమిషం ఆగితే రూ. 20,459 నష్టం కలుగుతుంది. ప్యాసింజర్ రైళ్లతో పోల్చితే గూడ్స్ రైళ్లకు కాస్త తక్కువగా నష్టం కలుగుతుంది. డీజిల్ గూడ్స్ రైలు నిమిషం ఆగితే రూ. 13,334 నష్టం కలుగుతుంది. విద్యుత్ తో నడిచే గూడ్స్ ట్రైన్ కు నిమిషానికి రూ. 13,392 నష్టం కలుగుతుంది. ఏ కారణంతోనైనా రైలు ఆగితే, మళ్లీ అది తన పూర్తి వేగాన్ని అందుకునేందుకు సుమారు 3 నిమిషాల సమయం పడుతుంది. రైలు స్పీడ్ అందుకునే క్రమంలో డీజిల్, లేదంటే విద్యుత్ ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. ప్రయాణ సమయంలో రైలు ఏ కారణం లేకుండా ఆగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిళ్లుతుందంటున్నారు రైల్వే అధికారులు.

Read Also: దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు.. గంటకు దీని వేగం ఎంతో తెలుసా?

ఒక రైలు ఏదైనా కారణంతో ఆగిపోతే, దాని ప్రభావం ఆ రూట్లో నడిచే ఇతర రైళ్ల మీద పడే అవకాశం ఉంటుంది. ఒక రైలు ఓ స్టేషన్ లో ఆగిపోతే, ఆ రైలు క్లియర్ అయ్యేంత వరకు స్టేషన్ మాస్టర్ మిగతా రైళ్లను అనుతించరు. ఒక వేళ ఏదైనా రైలును ముందు పంపించాలంటే రైల్లే స్టేషన్ లోని మరో ట్రాక్ లోకి ఆగాల్సిన రైలును తీసుకుంటారు. ఆ తర్వాత అత్యవసర రైలును పంపిస్తారు. ఆ తర్వాత నిలిచి ఉన్న రైలు వెళ్లేందుకు అనుమతిస్తారు.

Read Also: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్, రోజూ ఇక్కడ రైళ్లు కూడా ఆగుతాయండోయ్!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×