E-Paper
Advertisement

Indian Railway – Ayyappa Devotees: శబరిమలైకు రైలులో వెళ్తున్నారా.. ఈ రూల్ తప్పక పాటించాల్సిందే!

Indian Railway – Ayyappa Devotees: శబరిమలైకు రైలులో వెళ్తున్నారా.. ఈ రూల్ తప్పక పాటించాల్సిందే!
Advertisement

Indian Railway – Ayyappa Devotees: రైల్వే భద్రతా పరమైన అంశానికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే పలు సూచనలు జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించి అయ్యప్ప భక్తులు సహకరించాలని కూడా రైల్వే విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేరళలోని శబరిమలైకు అయ్యప్ప భక్తులు ఎక్కువగా తరలివస్తున్నారు. పవిత్రమైన మాలధారణ పాటించిన భక్తులు, తమ దీక్షను విరమించేందుకు అధిక సంఖ్యలో శబరిమలై అయ్యప్ప ఆలయానికి తరలివస్తారు. అటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఎందరో అయ్యప్ప భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఇప్పటికే, ఈ రైళ్లలో సీట్లను సైతం రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పటికే ఎందరో భక్తులు రైళ్ల ద్వార, శబరిమలై కు వెళ్లి తమ దీక్షను విరమించారు. కాగా అయ్యప్ప భక్తులు సాధారణంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ.

Advertisement

ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించి భక్తితో అయ్యప్ప గీతాలను ఆలపిస్తారు. అయితే కొందరు అయ్యప్ప భక్తులు పూజా విధానంలో భాగంగా కర్పూరం, హారతి, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తున్నట్లు రైల్వే శాఖ దృష్టికి వచ్చింది. దీనితో రైల్వే శాఖ అప్రమత్తమై ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read: AP Free Current Scheme: ఏపీలో ఉచిత విద్యుత్ స్కీమ్.. మీకు బిల్ వస్తుందా.. వెంటనే ఇలా చేయండి

Advertisement

రైలులో ప్రయాణించే అయ్యప్ప భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ సూచనలు తప్పక పాటించాలని రైల్వే కోరుతోంది. రైలులో ప్రయాణించే సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లో, అగ్గి రాజేసే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. అంటే పెద్ద ఎత్తున హారతులు ఇవ్వడం ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని రైల్వే తెలుపుతోంది. అలాగే అయ్యప్ప భక్తుల భద్రత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరి మీరు కూడా శబరిమలై వెళుతున్నారా.. మీతో పాటు మీతోటి స్వాముల భద్రతను దృష్టిలో ఉంచుకొని, రైల్వే శాఖ సూచనలు పాటించండి. అలాగే ఆ అయ్యప్పను దర్శించి, సకల కోరికలు తీరాలని వేడుకోండి.

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×