BIG TV LIVE Originals: భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్లు ఉన్నాయి. రోజూ 12 వేలకు పైగా రైళ్లు ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చుతున్నారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది రైళ్లలో జర్నీ చేసేందుకు ఇష్టపడుతారు. రైల్వే ప్రయాణాల కోసం రోజూ లక్షల కొద్ది టికెట్లు బుక్ అవుతాయి. ఇండియన్ రైల్వే రిజర్వేషన్ టికెట్లలో ఏకంగా 80 శాతానికి పైగా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. మిగతా టికెట్లు ఆఫ్ లైన్ లో తీసుకుంటున్నారు. అయితే, ఆన్ లైన్, విండో టికెట్ల ఛార్జీల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఆఫ్ లైన్ తో పోల్చితే, ఆన్ లైన్ లో ధర ఎక్కువగా ఉంటుంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
ఆన్ లైన్ టికెట్ ఛార్జీలు ఎందుకు ఎక్కువ అంటే?
IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే కాస్త ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ కన్వీనెన్స్ ఛార్జీ: అన్ని ఆన్ లైన్ బుకింగ్స్ సేవలకు సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. సెకెండ్, స్లీపర్ క్లాస్ కు ఈ ఫీజు రూ. 20గా ఉంటుంది. 1AC, 2AC, 3AC, చైర్ కార్(CC), 3E, లేదంటే ఫస్ట్ క్లాస్ (FC) టికెట్లకు రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది.
⦿ గేట్ వే ఛార్జీలు: ఆయా చెల్లింపు విధానాన్ని బట్టి రూ.5 నుంచి రూ. 20 వరకు లేదంటే టికెట్ ధరలో కొంత శాతం ఉంటుంది.
⦿ తత్కాల్, ప్రీమియం తత్కాల్: తత్కాల్ బుకింగ్లు సెకెండ్ క్లాస్ కు బేస్ ఛార్జీలో 10%, ఇతర తరగతులకు 30% సర్ఛార్జ్ను జోడిస్తారు ప్రీమియం తత్కాల్ డైనమిక్ ఛార్జీలు ఉంటాయి. దీని వల్ల టికెట్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది.
విండో టికెట్ ఛార్జీలు ఎందుకు తక్కువ?
రైల్వే స్టేషన్ కౌంటర్లలో కొనుగోలు చేసిన టికెట్ల ధరలు తక్కువకు లభిస్తాయి. దానికి కారణాలు ఎంటంటే..
⦿ కన్వీనియెన్స్ ఛార్జీలు లేవు: ఆన్ లైన్ బుకింగ్ ల మాదిరిగా కాకుండా.. విండో టికెట్లకు రూ. 20 నుంచి రూ. 40 సర్వీస్ ఛార్జ్ ఉండదు.
⦿ తత్కాల్ ఛార్జీలు: ఆన్లైన్ బుకింగ్ల మాదిరిగానే సెకండ్ క్లాస్కు 10%, ఇతర తరగతులకు 30% ఛార్జీలు ఉంటాయి. కానీ, అదనపు ఆన్ లైన్ ఫీజులు ఉండవు.
⦿ పేమెంట్స్ ఛార్జీలు: విండో టికెట్లను సాధారణంగా నగదు రూపంలో లేదంటే కార్డు ద్వారా చెల్లిస్తారు. ఇందుకోసం అదనపు చెల్లింపులు ఉండవు. కొన్ని కౌంటర్లు కొంత మేర కార్డ్ ప్రాసెసింగ్ రుసుములను వసూలు చేస్తాయి.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్ల మధ్య ధరలో తేడాలు
ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా కన్వీనియన్స్ ఫీజు, గేట్ వే ఛార్జీల కారణంగా టికెట్ కు రూ. 20– రూ.40 వరకు ఎక్కువ ధర ఉంటుంది. ఆన్ లైన్లో 3AC టిక్కెట్లను బుక్ చేసుకునే నలుగురు వ్యక్తుల కుటుంబం గేట్వే ఫీజులు మినహా విండో టిక్కెట్లతో పోలిస్తే అదనంగా రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ లేదంటే ప్రీమియం తత్కాల్ కోసం, బేస్ ఫేర్, సర్ ఛార్జీలు అలాగే ఉంటాయి. కానీ, ఆన్ లైన్ ఫీజులు లేకపోవడం వల్ల విండో టికెట్లు కొంచెం చౌకగా ఉంటాయి.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్లతో లాభనష్టాలు
⦿ ఆన్ లైన్ బుకింగ్: రియల్- టైమ్ సీట్ల లభ్యత, 24/7 యాక్సెస్ ఉంటుంది. తత్కాల్ బుకింగ్లకు ఆన్ లైన్ విధానం సులభంగా ఉంటుంది. కాకపోతే, ఫీజులు అధికంగా ఉంటాయి.
⦿ విండో బుకింగ్: సర్వీస్ ఛార్జీలను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, స్టేషన్ కు వెళ్లడం, క్యూలో నిలబడటం లాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలి. సాధారణంగా ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు టికెట్ల బుకింగ్ ఉంటుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: వందే భారత్ స్లీపర్ రైల్లో ఫ్రీ ఫుడ్? ఏయే వెరైటీలు పెడతారంటే?