E-Paper
Advertisement

Indian Railways rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త లగేజ్ రూల్స్ పై క్లారిటీ ఇదే!

Indian Railways rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త లగేజ్ రూల్స్ పై క్లారిటీ ఇదే!

Indian Railways rules: ఇటీవల సోషల్ మీడియాలో ఇండియన్ రైల్వే ప్రయాణికుల సామాన్ల బరువుపై కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయని వార్తలు వైరల్‌గా మారాయి. రైల్వే స్టేషన్లలో ప్రవేశ ద్వారాలు, బయలుదేరే గేట్ల వద్ద సామాన్లను స్కాన్ చేసి, బరువు చెక్ చేసి మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తారన్న సమాచారం విస్తృతంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ వార్తలకు పూర్తిగా విరుద్ధంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఎటువంటి కొత్త నియమాలు అమలు చేయలేదని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత నియమాలను ఎవరో తీసుకుని కొత్తగా చూపించారు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ మాత్రమే. రైల్వేలో కొత్తగా ఎలాంటి బ్యాగేజ్ చెకింగ్ నియమాలు తీసుకురాలేదని మంత్రి ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

పాత నియమాలే.. కొత్తవి కావు
రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, రైలు ప్రయాణికుల సామాన్ల బరువు పరిమితి కొత్తగా అమలు చేసినది కాదని, ఇది చాలా కాలంగా ఉన్నదని. సాధారణంగా స్టేషన్లలో ప్రతిరోజూ బ్యాగేజ్ వెయింగ్ చేయరు. అయితే, ప్రధాన స్టేషన్లలో లేదా పార్సిల్ కార్యాలయాల దగ్గర అనుమానం కలిగించే పెద్ద సూట్‌కేసులు, టీవీలు లేదా భారీ బాక్స్‌లు ఉన్నప్పుడు మాత్రమే చెకింగ్ జరుగుతుంది.

ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లు (TTEలు) లేదా లగేజ్ ఇన్‌స్పెక్టర్లు అవసరమైతే ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేసే హక్కు కలిగి ఉంటారు. అదేవిధంగా, సెక్యూరిటీ చెకింగ్ సమయంలో కూడా బ్యాగేజ్ స్కానింగ్ లేదా బరువు పరిశీలన జరగవచ్చు.

ప్రస్తుత లగేజ్ వెయిట్ పరిమితులు
ఇండియన్ రైల్వే ప్రకారం, ప్రయాణికులు ఉచితంగా తీసుకెళ్లగల సామాన్ల బరువు వివరాలు ఇవే..
జనరల్, సెకండ్ క్లాస్ ప్రయాణికులు – 35 కిలోల వరకు
స్లీపర్ క్లాస్ ప్రయాణికులు – 40 కిలోల వరకు
థర్డ్ ఏసీ (3AC) ప్రయాణికులు – 40 కిలోల వరకు
సెకండ్ ఏసీ (2AC) ప్రయాణికులు – 50 కిలోల వరకు
ఫస్ట్ ఏసీ (1AC) ప్రయాణికులు – 70 కిలోల వరకు
అదనంగా, ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు 10 నుండి 15 కిలోల వరకు అదనపు సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ పరిమితిని మించితే, ఆ అదనపు సామానును పార్సిల్‌గా ముందుగా బుక్ చేయాల్సి ఉంటుంది.

ఎక్సెస్ బ్యాగేజ్ ఉంటే జరిమానా తప్పదు
ఒకవేళ ఎవరికైనా అనుమతించిన బరువును మించే సామాను ఉంటే, దానిని రైలు బయలుదేరే ముందు పార్సిల్ ఆఫీసులో ముందుగానే రిజిస్టర్ చేయాలి. బుక్ చేయని అదనపు లగేజ్‌తో ప్రయాణిస్తున్నప్పుడు, TTEలు లేదా లగేజ్ ఇన్‌స్పెక్టర్లు ఆ సామానును తనిఖీ చేసి, బరువును లెక్కించి జరిమానా విధించే అధికారం కలిగి ఉంటారు. ఈ జరిమానా మొత్తం సామాన్ల అదనపు బరువు, ప్రయాణించే దూరం ఆధారంగా నిర్ణయించబడుతుంది.

అపోహలకు తెరదించండి
రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారం వల్ల చాలామంది ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. రైల్వే అధికారులు పునరుద్ఘాటిస్తూ చెబుతున్నారు. స్టేషన్లలో కొత్తగా ఎలక్ట్రానిక్ స్కానర్లు లేదా బ్యాగేజ్ వెయింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం లేదు. ఎప్పటిలాగే పాత నియమాల ప్రకారమే తనిఖీలు జరుగుతాయట.

Also Read: Hyderabad Police: డీజేలకు నో.. హైదరాబాద్ భక్తులకు పోలీస్ గైడ్ లైన్స్ ఇవే!

ప్రయాణికులు కూడా తమ ప్రయాణంలో సమస్యలు రాకుండా ముందుగానే తమ లగేజ్ బరువును తనిఖీ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాల సమయంలో లేదా కుటుంబ సభ్యులు, పెద్ద సామాన్లతో వెళ్తున్నప్పుడు నియమాలను పాటించడం అవసరం.

ప్రయాణికులకు సూచనలు
ప్రయాణానికి ముందు తమ బ్యాగేజ్ బరువును ఒకసారి తనిఖీ చేసుకోవాలి. అదనపు సామానును ముందుగా రిజిస్టర్ చేసి బిల్లు తీసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్‌లో గందరగోళం లేకుండా ముందుగానే స్టేషన్‌కి చేరుకోవాలి. రైల్వే సిబ్బందితో వాగ్వాదాలు లేకుండా సహకరించాలి.

రైల్వే అధికారులు ఈ నియమాలు ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా చాలా కాలంగా అమలులో ఉన్నవే. అవి కొత్తవి కావని ధృవీకరిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అపోహలపై నమ్మకం పెట్టుకోకుండా, అధికారిక సమాచారం కోసం ఇండియన్ రైల్వే వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×