BigTV English
Advertisement

Pinakini Express new look: మరింత సౌకర్యవంతంగా విజయవాడ టు చెన్నై జర్నీ.. ఈ ట్రైన్ మిస్ కావద్దు..!

Pinakini Express new look: మరింత సౌకర్యవంతంగా విజయవాడ టు చెన్నై జర్నీ.. ఈ ట్రైన్ మిస్ కావద్దు..!

Pinakini Express new look: విజయవాడ నుంచి చెన్నై మధ్య రోజూ పరుగులు తీసే పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ చాలా మందికి జీవితంలో ఓ భాగమే. ఉద్యోగాలకోసం, కుటుంబ కలయికల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ట్రైన్ లో ప్రయాణించే వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ట్రైన్‌లో ఒక్కసారి కూర్చున్నవారికి, ఇది ఎలా మారిందో ఇప్పుడు ఒక్కసారి ప్రయాణిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే.. పినాకినీ ఇప్పుడు మారిపోయింది. చూడడానికి కాకపోయినా, లోపల అడుగుపెట్టగానే అనిపిస్తుంది ఇది కొత్త పినాకినీ అని. మరి అది ఎందుకో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.


పినాకినీ లో మారిందేంటి?
ఇంతకీ మారింది ఏంటి? పాత కోచ్‌లు తొలగించి, ఇప్పుడు కొత్త మోడల్‌లో తయారైన కోచ్‌లతో ట్రైన్‌ని నడిపిస్తున్నారు. వీటిని ఎల్‌హెచ్‌బీ అని రైల్వే భాషలో అంటారు కానీ మనం సూటిగా చెప్పాలంటే.. ఇవి వేగంగా, సురక్షితంగా, ప్రశాంతంగా ప్రయాణించేందుకు రూపొందించిన కోచ్‌లు.

ముందుగా మనం ప్రయాణించే ట్రైన్లలో తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దం గుర్తుందా? ప్రతి మలుపులో ఊగే బోగీలు గుర్తున్నాయా? మరి సీట్లో కూర్చుంటే ఎదుటివాళ్ళ కాలు తగిలి అసహనంగా అనిపించిన క్షణాలేమిటి? ఇవన్నీ ఇప్పుడు కాస్త తగ్గిపోయాయి. ఎందుకంటే ఈ కొత్త కోచ్‌లు గాలి ధ్వనిని లోపలకి రానీయకుండా అడ్డుకుంటాయి. మలుపుల్లో బాగా ఊగక, స్టెడీగా ట్రైన్ నడుస్తుంది. అంతేకాదు, ప్రమాదం జరిగినా ఈ కోచ్‌లు పైనుండి పడిపోయేలా ఉండవు. ప్రయాణికులకు భద్రత మరింతగా లభించేలా ఉండేలా ఇవి ప్రత్యేకంగా తయారవుతున్నాయి.


ఇప్పటి దాకా పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ అనేది సాధారణ ట్రైన్‌గా అందరినీ చేరదీసింది. కానీ ఇప్పుడు అది వేగం, నూతనత, సౌలభ్యం అన్న మూడు అంశాల్లో ముందుకు దూసుకుపోతోంది. కొత్త కోచ్‌లతో ఇప్పుడు ట్రైన్ మరింత వేగంగా ప్రయాణించగలదు. ఇదివరకు ట్రైన్‌ను వేగంగా నడిపితే గాడిలోంచి ఊగే అవకాశం ఉండేది. కానీ ఈ కోచ్‌ల డిజైన్‌ అలా ఉండదు. ఇవి స్పీడ్‌కి తగ్గట్టుగా దృఢంగా తయారవుతాయి.

సౌకర్యాలు ఎన్నో ఎన్నెన్నో..
ఇక మనం ఎక్కువగా ఆశించే అంశం.. సౌకర్యం. కొత్తగా డిజైన్‌ చేసిన సీట్లు, మెత్తని కుషన్లు, మూడింటి సీటింగ్‌తో ప్రయాణంలో తలనొప్పి లేకుండా ఉంటుంది. కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి, పని చేసేవాళ్లకూ, పుస్తకం చదివేవాళ్లకూ, నిద్రపోయే వాళ్లకూ ఇది పెద్ద ఊరట. విజయవాడ – చెన్నై మధ్య ఈ మార్పు ముఖ్యంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇది రోజూ నడిచే ట్రైన్. అంటే రోజూ వందలాది మంది ప్రయాణికులకు ఇదే ట్రైన్. అలాంటి వారికి ఇంకా మంచి అనుభవాన్ని ఇవ్వాలన్నదే ఈ మార్పు వెనుక రైల్వే ఉద్దేశం.

Also Read: AP to Puri Train List: పూరీ రథయాత్ర.. ఏపీ మీదుగా వందలాది ప్రత్యేక రైళ్లు.. ఆ వివరాలు మీకోసమే!

ఇంకా చెప్పుకోవాలంటే, ఇది మనకు గర్వించదగ్గ విషయం కూడా. ఎందుకంటే ఈ మార్పు చక్కగా జరిగిన రోజు నుంచే ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా, మరికొందరు ఇది నిజంగా మోడరన్ టచ్ ఉన్న ట్రైన్ అని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలతో ప్రయాణించే కుటుంబాలు.. అందరూ ఈ మార్పు వల్ల ప్రయాణం కాస్త తేలికగా మారిందని చెబుతున్నారు.

ఒకప్పటి పినాకినీ తక్కువ స్పీడ్‌తో, ఎక్కువ శబ్దంతో, కొంత అసౌకర్యంతో ఉండేది. కానీ ఇప్పుడు ఇదే పినాకినీ కొత్త ఆవిష్కరణతో, ప్రయాణికుడి కోసం కొత్తతనం తోడుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది ఒక ట్రైన్ మార్పు మాత్రమే కాదు.. మన ప్రయాణం తీరు మారిందని గుర్తించాల్సిన సమయం. పాత దారుల మీద కొత్త అనుభూతులు.. అదే ఈరోజు పినాకినీ అందిస్తున్న ప్రత్యేకత. మరెందుకు ఆలస్యం.. విజయవాడ నుండి చెన్నై కి ఈ ట్రైన్ జర్నీ సాగించండి.. కొత్త అనుభూతి పొందండి.

Related News

Indian Railway: షాకింగ్.. గుట్కా మరకలు క్లీన్ చేసేందుకు రైల్వే ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Big Stories

×