BigTV English
Advertisement

Indian Railways Rule: మీ టికెట్ తో వేరే వాళ్లు కూడా జర్నీ చెయ్యొచ్చు, ఇండియన్ రైల్వే కొత్త రూల్ గురించి తెలుసా?

Indian Railways Rule: మీ టికెట్ తో వేరే వాళ్లు కూడా జర్నీ చెయ్యొచ్చు, ఇండియన్ రైల్వే కొత్త రూల్ గురించి తెలుసా?

Indian Railways Ticket Rules: రైళ్లో ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల బెర్త్ కచ్చితంగా లభిస్తుంది. అయితే, కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. లేదంటే వాయిదా పడుతుంది. ఆ సమయంలో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు.   రైలు బయల్దేరే సమయాన్ని బట్టి టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని రీఫండ్ ఇస్తారు. అయితే, ఇకపై టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి అవసరం లేదు. మీ టికెట్ ద్వారా ఇతరులు ప్రయాణించే అవకాశం కల్పించింది భారతీయ రైల్వే. ఈ విధానం వల్ల మీకు పూర్తి డబ్బులు వస్తాయి. ఇతరులు హాయిగా కన్ఫార్మ్ టికెట్ తో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ కొత్త రూల్ ను ఎలా ఉపయోగించుకోవాలంటే..


 మీ టికెట్ తో ఇతరులు ప్రయాణించడం ఎలా?   

అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ అయిన వారికి టికెట్ మార్పిడి సౌకర్యాన్ని కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. అయితే, ఓ కండీషన్ పెట్టింది. మీ టికెట్ మీద ప్రయాణం చేయాల్సిన వాళ్లు మీ కుటుంబ సభ్యులు అయి ఉండాలి. అప్పుడే మీ టికెట్ మార్చుకోవచ్చు. మీ టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే, మీ రిజర్వేషన్ టికెట్ మీద కేవలం మీ కుటుంబ సభ్యులే జర్నీ చేసే అవకాశం ఉంటుంది.


మీరు టికెట్ ఎలా మార్పిడి చేసుకోవాలంటే?   

మీ టికెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా.. కౌంటర్ లో బుక్ చేసుకున్నా, ఇతరులకు మార్పిడి చేయాలంటూ రైల్వే స్టేషన్ లోని కౌంటర్ కు వెళ్లాల్సిందే. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్లే సమయంలో టికెట్ ప్రింట్ అవుట్ తో పాటు ప్రయాణించే వ్యక్తి గుర్తింపు కార్డు జీరాక్స్ ను తీసుకెళ్లాలి. అక్కడ టికెట్ ఛేంజ్ ఫారమ్ నింపి ఇవ్వాలి. కౌంటర్ లోని సిబ్బంది మీ వివరాలను పరిశీలించి టికెట్ మీద పాత ప్రయాణీకుడి పేరు కొట్టివేసి , కొత్తగా ప్రయాణించే వారి పేరును ఎంటర్ చేస్తారు. అయితే, టికెట్ మార్పిడి అనేది రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు వరకే చేస్తారు.

బోర్డింగ్ స్టేషన్ ఆప్షన్ ను మార్చుకునే అవకాశం

మీరు టికెట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత మీ బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కారణాలతో మీరు ముందుగా అనుకున్న బోర్డింగ్ స్టేషన్ లో రైలు ఎక్కలేకపోతే, బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీరు టికెట్ వేరే వాళ్లకు ట్రాన్స్ ఫర్ చేసిన వాళ్లు కూడా ఆ స్టేషన్ నుంచి ఎక్కలేకపోతే, బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవచ్చు. IRCTC వెబ్ సైట్ ద్వారా సింపుల్ గా ‘బోర్డింగ్ పాయింట్ ఛేంజ్’ ఆప్షన్ ను ఎంచుకుని మీ బోర్డింగ్ అప్షన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది.

Read Also: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?

Related News

IRCTC TN Temples Tour: హైదరాబాదు నుండి తమిళనాడు ఆలయాల యాత్ర.. 7 రోజుల ఆధ్యాత్మిక పర్యటన వివరాలు

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Big Stories

×