E-Paper
Advertisement

India’s Last Railway Station: భారత్ లో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఇదే! కానీ, ఇక్కడ రైలు ఆగదు ఎందుకో తెలుసా?

India’s Last Railway Station: భారత్ లో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఇదే! కానీ, ఇక్కడ రైలు ఆగదు ఎందుకో తెలుసా?
Advertisement

Last Railway Station in India: భారతీయ రైల్వే సంస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, ఎన్నో విశేషాలను కలిగి ఉంది. అలాంటి వాటిలో ఒకటి దేశంలోనే చిట్ట చివరి రైల్వే స్టేషన్. ఇది భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న సింగాబాద్ రైల్వే స్టేషన్.  పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లా సింగాబాద్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ తర్వాత భారత భూభాగం పూర్తవుతుంది. బంగ్లాదేశ్ సరిహద్దు మొదలవుతుంది.

గొప్ప చరిత్రకు నిదర్శనం సింగాబాద్ రైల్వే స్టేషన్  

Advertisement

సింగాబాద్ రైల్వే స్టేషన్ గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఆంగ్లేయుల కాలంలో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలకు ఈ రైల్వే స్టేషన్ కీలక పాత్ర పోషించింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఈ స్టేషన్ మీదుగా మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప నాయకులు ఢాకాకు వెళ్లేవారు. అక్కడ దేశ స్వాతంత్ర్యం కోసం చేపట్టాల్సిన ఉద్యమాల గురించి చర్చించే వారు. పలు విదేశీ నాయకులను కలిసి సమాలోచనలు జరిపేవారు. వాటికి ఈ రైల్వే స్టేషన్ ఎంతగానో ఉపయోగపడేది.

కేవలం గూడ్స్ రైళ్ల సేవలు

Advertisement

ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో కార్యకలాపాలు అంతగా లేవు. ఈ స్టేషన్ లో ఏ ప్యాసెంజర్ రైళ్లు ఆగడం లేదు. కేవలం కొన్ని గూడ్స్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. కేవలం వ్యాపార కార్యకలాపాల కోసమే ఈ రైల్వే స్టేషన్ ను ఉపయోగిస్తున్నారు.

బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి మొదలుకొని, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత వరకు   సింగాబాద్ రైల్వే స్టేషన్ బాగా అభివృద్ధి చెదింది. భారత్-బంగ్లాదేశ్ నడుమ ప్రయాణీలకు, వస్తువుల రవాణాకు ఈ స్టేషన్ ఎంతో ఉపయోగపడింది. 1978లో సింగాబాద్ నుంచి సరకు రవాణా రైళ్లను నడపడానికి ఇరు దేశాల నడుమ ఒప్పందం కూడా జరిగింది. 2011 నుంచి నేపాల్‌ వరకు సరుకుల రవాణాకు ఈ స్టేషన్ ను ఉపయోగించారు. బంగ్లాదేశ్, నేపాల్ నుంచి భారత్ కు, భారత్ నుంచి ఆ రెండు దేశాలకు ఇక్కడి నుంచే సరుకులను రవాణా చేసే వాళ్లు. ప్రముఖ రవాణా కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత ఈ స్టేషన్ వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ప్రయాణీకుల కోసం ఏ రైలూ ఆగడం లేదు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారమ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ఈ స్టేషన్ లో కొద్ది మంది మాత్రమే రైల్వే సిబ్బంది ఉంటారు. వారు కూడా కేవలం గూడ్స్ రైళ్లను పర్యవేక్షిస్తుంటారు.  ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగు వెలిగిన ఇప్పుడు మూగబోడంపై ఈ స్టేషన్ తో అనుబంధం ఉన్న పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: రైలు కూతలో ఇన్ని రకాలున్నాయా? ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

న్యూక్లియర్ రియాక్టర్ వేడితో హైడ్రోజన్ ఉత్పత్తి.. భారత టెక్నాలజీకి ప్రపంచం షాక్!

పాదరక్షలు లేకుండా 32 కి.మీ నడక.. సింహాచల గిరి ప్రదక్షిణ విశిష్టత ఇదే!

రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!

Big Stories

Advertisement
×