E-Paper
Advertisement

Tirupati: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. 40 నిమిషాలు గాల్లోనే, టెన్షన్ పడిన ప్రయాణికులు

Tirupati: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. 40 నిమిషాలు గాల్లోనే, టెన్షన్ పడిన ప్రయాణికులు

Tirupati:  ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది‌క్షణాలకే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక కాసేపు టెన్షన్ పడ్డాడు పైలట్. దాదాపు 40 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి మళ్లీ రేణిగుంట ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

అహ్మదాబాద్ ఘటన తర్వాత రోజుకో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం రేణిగుంట నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి  రాత్రి ఎనిమిది గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్దిక్షణాలకే సాంకేతిక సమస్య తలెత్తింది.

ఏం చెయ్యాలో తెలియక కాసేపు విమానాన్ని దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించాడు పైలట్. ల్యాండింగ్‌కు క్లియరెన్స్ రావడం ఆలస్యం కావడంతో గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో ఏం జరగుతుందో తెలియక విమానంలో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. అంతా ఓకే అయిన తిరిగి మళ్లీ రేణిగుంటలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఏసీలు పని చేయకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు హైదరాబాద్ ట్రిప్‌ని రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఉన్నట్లుండి విమాన సర్వీసు రద్దుకావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో విమానాశ్రయంలో ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణికులు.

ALSO READ: ఆ లైసెన్స్ ఉంటే చాలు.. యూఏఈ రోడ్లపై దూసుకెళ్లొచ్చు

తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఇండిగో తెలిపింది. కేవలం ఇండిగో విమానం మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో ఎయిరిండియా మిగతా సంస్థల విమానాలకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

ప్రతీ రోజు ఈ విధంగా సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు ఆయా విమాన సంస్థలపై రుసరుసలాడుతున్నారు. ఇదేకాదు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు స్పైస్ జెట్ విమానం వచ్చింది. తిరిగి వెళ్లే క్రమంలో ఆ విమానం మొరాయించడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు.

 

 

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×