E-Paper
Advertisement

Karnataka Express: బాంబు బెదిరింపు.. 4 గంటలు ఆలస్యంగా నడిచిన ఎక్స్ ప్రెస్ రైలు

Karnataka Express: బాంబు బెదిరింపు.. 4 గంటలు ఆలస్యంగా నడిచిన ఎక్స్ ప్రెస్ రైలు
Advertisement

Karnataka Exprees: ఢిల్లీ నుండి బెంగళూరుకు వెళుతున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు.. ట్రైన్ నంబర్ 12628 వాడి రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు కారణంగా ఆదివారం నాలుగు గంటల పాటు ఆగిపోయింది. ఈ సంఘటన దాదాపు 1,500 మంది ప్రయాణికులలో ఆందోళనను రేకెత్తించింది. రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడంతో ఈ బెదిరింపు వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు.

వాడి స్టేషన్‌లో రైలును ఆపిన రైల్వే పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో కూడిన బృందం రైలు యొక్క 22 కోచ్‌లను సమగ్రంగా తనిఖీ చేసింది. ప్రయాణికులను రైలు నుండి దించి..తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రక్రియ సుమారు నాలుగు గంటలు సాగింది. కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. తర్వాత.. ఈ బెదిరింపు ఫేక్ అని తేలింది.

Advertisement

రైల్వేకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని వాడి రైల్వే పోలీసులు గుర్తించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీప్‌సింగ్ రాథోడ్ గా గుర్తించారు. పోలీసుల విచారణలో.. రాథోడ్ తాను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. బెదిరింపు వెనుక అసలు ఉద్దేశం స్పష్టంగా తెలియలేదు. రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన ప్రయాణికులలో.. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులలో తీవ్ర భయాందోళనలను కలిగించింది. నాలుగు గంటలు రైలు ఆలస్యం అవ్వడం రైలు షెడ్యూల్‌లో ఆటంకం ఏర్పడింది. అధికారులు ఇటువంటి నకిలీ బెదిరింపులు రైల్వే సేవలను అడ్డుకోవడమే కాకుండా.. ప్రయాణికులలో భయాన్ని సృష్టించి, చట్టపరమైన పరిణామాలను కూడా కలిగిస్తాయని హెచ్చరించారు.

Advertisement

Also Read: లడఖ్‌‌.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, ఎందుకంత స్పెషల్ అంటే ?

ఇటీవలి కాలంలో.. భారతదేశంలో రైళ్లు, విమానాశ్రయాలు, ఇతర రద్దీ ప్రదేశాలలో నకిలీ బాంబు బెదిరింపుల సంఖ్య పెరిగింది. 2024లో బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ , పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కానీ అవి కూడా నకిలీవిగా తేలాయి. ఈ బెదిరింపులు భద్రతా వ్యవస్థలపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. ప్రజలలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అధికారులు ఇటువంటి చర్యలను నియంత్రించడానికి కఠిన చట్టాలను అమలు చేయాలి. ప్రజలు ఇటువంటి బాధ్యతారహిత చర్యలకు పాల్పడకుండా ఉండాలని.. ఇలాంటి సమయాల్లో ప్రయాణికులు అధికారులతో సహకరించాలని రైల్వే శాఖ సూచించింది.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×