E-Paper
Advertisement

Golden Chariot Train: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..

Golden Chariot Train: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..
Advertisement

Golden Chariot Luxury Train: భారతీయ రైల్వే సంస్థ తక్కువ టికెట్ ఛార్జీలతో నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నది. తక్కువ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది సామాన్యులు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఓ వైపు పేద ప్రజలకు తక్కువ ధరలో రైలు ప్రయాణాన్ని అందిస్తున్న ఇండియన్ రైల్వే సంస్థ.. అదే సమయంలో అత్యంత లగ్జరీ ప్రయాణాలను కూడా అందిస్తోంది. అందులో భాగంగానే గోల్డెన్ చారియట్ అనే లగ్జరీ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ‘జ్యువెల్ ఆఫ్ ది సౌత్’ పేరుతో బెంగళూరు నుంచి ఈ రైలు ప్రయాణం మొదలయ్యింది.

గోల్డెన్ చారియట్ కు తగ్గిన ఆదరణ

Advertisement

ఈ లగ్జరీ రైలులో మొత్తం 80 మంది ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉంటుంది. 13 డబుల్ బెడ్ క్యాబిన్లు, 26 ట్విన్ బెడ్ క్యాబిన్లతో పాటు దివ్యాంగుల కోసం ఓ క్యాబిన్ ఉంటుంది. అయితే, తాజాగా ఈ రైలు కేవలం 38 మంది ప్రయాణీకులతో తన యాత్రను మొదలు పెట్టింది. కర్నాటక పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో పాటు కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSTDC) ద్వారా నిర్వహించబడుతుంది. ఇందులో ఒక్కో టికెట్ ధరను రూ.67,961.79 ($800)గా నిర్ణయించింది.

ఐదు నైట్లు, ఆరు రోజుల ప్రయాణం

Advertisement

తాజాగా బెంగళూరు నుంచి ప్రారంభం అయిన ఈ రైలు ప్రయాణం మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు కొనసాగనుంది. బెంగళూరు, మైసూరు, కాంచీపురం, మహాబలిపురం, తంజావూరు, చెట్టినాడ్,  కొచ్చికి వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను ఈ పర్యటనలో చూసే అవకాశం ఉంది.

2018లో గోల్డెయిన్ చారియట్ రైలు కాకర్యకలాపాలు నిలిపివేత

తొలుత గోల్డెన్ చారియట్ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నెమ్మదిగా ఆదరణ తగ్గింది. 2018లో  గోల్డెన్ చారియట్ రైలు కార్యకలాపాలను నిలిపివేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ రైలు సేవలను నిలిపివేస్తూ IRCTC నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో మళ్లీ ప్రారంభించబడింది.  రైల్వేతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని, లాభాలు ఆర్జించాలని భావిస్తున్నట్లు కర్నాటక టూరిజం అధికారులు తెలిపారు.

ఆక్యుపెన్సీ చాలా తక్కువ

2020తో పాటు 2021లో గోల్డెయిన్ చారియట్ కు సంబంధించి 3 ప్రత్యేక కస్టమైజ్డ్ ట్రిప్‌లు నిర్వహించినట్లు IRCTC అధికారులు తెలిపారు. అయితే, ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. “మేము మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం కల్పించాం. వ్యక్తులు, కంపెనీల కోసం ఈ అవకాశం అందించాం. అందులో భాగంగానే ఇప్పటికే KSTDC, IRCTC జాయింట్ గా రెండు ట్రిప్ లు నిర్వహించనున్నాయి. డిసెంబరు 29,  ఫిబ్రవరి 13(2025)న రెండు ప్రైవేట్ కంపెనీలు ఈ ట్రిప్పులను బుక్ చేసుకున్నాయి” అని IRCTC అధికారులు తెలిపారు.

Read Also: ఈ ఏడాది ఇన్ని వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయా? వచ్చే ఏడాది ఇండియన్ రైల్వేలో మరింత జోష్!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×