BigTV English
Advertisement

Vishaka Vande Bharat: విశాఖ వందేభారత్ కోచ్ లు సగానికి కుదింపు, కారణం ఏంటో తెలుసా?

Vishaka Vande Bharat: విశాఖ వందేభారత్ కోచ్ లు సగానికి కుదింపు, కారణం ఏంటో తెలుసా?

Visakhapatnam- Durg Vande Bharat Express: సెమీ హైస్పీడ్ రైలుగా ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ తక్కువ కాలంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. వేగవంతమైన ప్రయాణం, అత్యాధునిక సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో ప్రయాణీకులు ఈ రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో కోచ్ ల సంఖ్య పెంచుతున్నారు రైల్వే అధికారులు. రీసెంట్ గా సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైళ్లకు సంబంధించి కోచ్ ల సంఖ్యను పెంచారు. వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అదనపు కోచ్ లను యాడ్ చేశారు.


విశాఖ-దుర్గ్ వందేభారత్ కోచ్ లు సగానికి తగ్గింపు

ఇక తాజాగా రైల్వే అధికారులు విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడిచే వందేభారత్ రైలు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు కోచ్ లు సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రూట్ లో పెద్దగా ప్రయాణీకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16న విశాఖ-దుర్గ్((20829/20830) రైలును అధికారులు ప్రారంభించారు. 16 కోచ్ లతో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ రూట్ లో అనుకున్న స్థాయిలో ప్రయాణీకుల నుంచి ఆదరణ లభించడం లేదు. కేవలం 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. అటు దుర్గ్ నుంచి విశాఖ వచ్చే సమయంలో రాయగఢ వరకు 50 శాతం ఆక్యుపెన్సీ ఉంటుండగా, ఆ తర్వాత విశాఖ వరకు కేవలం 20 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీ ఉంటున్నది. కోచ్ లన్నీ ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి.


ఎందుకు ఈ వందేభారత్ కు ఆదరణ లేదంటే?

విశాఖ-దుర్గ్ వందేభారత్ రైలుకు ఆదరణ అంతగా లేకపోవడానికి కారణం టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటమే అనే టాక్ వినిపిస్తున్నది. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి సాధారణ రైళ్లలో టికెట్ ధర రూ. 145. అదే వందేభారత్ రైళ్లలో రూ. 565గా ఉంది. ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ రైలు ఎక్కడం లేదనే చర్చ నడుస్తున్నది. వాస్తవానికి ఈ రైలు క్యాన్సిల్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తొలుత కోచ్ ల సంఖ్య తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: ఈ రైల్లో వెళ్లేందుకు టికెట్ అవసరం లేదు, 75 ఏండ్లుగా ఫ్రీ సర్వీస్ అందిస్తున్న ట్రైన్ గురించి మీకు తెలుసా?

ఇవాళ్టి నుంచి 8 కోచ్ లతో ప్రయాణం

ఇక కోచ్ ల తగ్గింపు ఇవాళ్టి(జనవరి 24)నుంచి అమలు అవుతుందని అధికారులు తెలిపారు. 16 కోచ్ లు కాస్త ఇవాళ్టి నుంచి 8 కోచ్ లకు చేరుకోనుంది. వీటిలో ఏడు కోచ్‌లు చైర్‌ కార్‌ కోచ్ లు. ఒక్కో కోచ్ లో 70 సీట్లు ఉంటాయి. మరో కోచ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ ఉంటుంది. ఇందులో 40 సీట్లు ఉంటాయి. వాస్తవానికి వందేభారత్ రైళ్లు ఆయా రూట్లలో ప్రయాణీకుల ఆదరణను బట్టి 4, 8, 12, 16, 20, 24 కోచ్ తో నడుస్తున్నాయి.

Read Also: డబ్బులు లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇండియన్ రైల్వే సూపర్ సర్వీస్ గురించి మీకు తెలుసా?

Related News

Viral Video: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!

Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్‌ ప్రెస్‌..

Cyclone Montha Effect: మొంథా ఎఫెక్ట్, వందేభారత్ సహా పలు రైల్వే సర్వీసులు బంద్!

IRCTC Tour Package: కాశీ నుంచి అయోధ్య వరకు.. 5 రోజుల పవిత్ర యాత్రలో భాగమయ్యే అవకాశం

Triyani Waterfalls : తెలంగాణలో క్రేజీ బ్లూ వాటర్ ఫాల్స్.. చూస్తే మైమరచిపోవాల్సిందే!

Tirumala Accommodation: అనుకోకుండా తిరుమలకు వెళ్లారా? ఇలా ట్రై చేస్తే కచ్చితంగా రూమ్ దొరుకుతుంది!

Viral Video: అండర్ వేర్ లో కిలో బంగారం.. ఎయిర్ పోర్టులో అడ్డంగా బుక్కైన కిలేడీ!

Air India Bus Fire: ఢిల్లీ విమానాశ్రయంలో మంటలు, కాలి బూడిదైన ఎయిర్ ఇండియా బస్సు!

Big Stories

×