E-Paper
Advertisement

Floating Airport: నీటిపై తేలియాడే ఎయిర్ పోర్టు, కొద్ది కాలంలో కనుమరుగుకానుందా?

Floating Airport: నీటిపై తేలియాడే ఎయిర్ పోర్టు, కొద్ది కాలంలో కనుమరుగుకానుందా?

Japan Floating Airport: ప్రపంచ విమానయాన రంగం రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. తక్కువ భూభాగం ఉన్న దేశాలు, ఏకంగా సముద్ర జలాలపైనే విమానాశ్రయాలను నిర్మిస్తున్నాయి. ప్రపంచంలో తొలిసారి తేలియాడే ఎయిర్ పోర్టు నిర్మించింది జపాన్. ఇంతకీ ఈ ఎయిర్ పోర్టును ఎలా నిర్మించింది? ఎప్పుడు నిర్మించింది? దీని ప్రత్యేకతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1994లో తేలియాడే ఎయిర్ పోర్టు నిర్మాణం

తేలియాడే ఎయిర్ పోర్టును జపాన్ ప్రభుత్వం 1994లో నిర్మించింది. ఈ ఎయిర్ పోర్టుకు కన్సాయ్ అనే పేరు పెట్టింది.  ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అప్పట్లోనే ఏకంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకునేలా దీనిని నిర్మించినట్లు అప్పట్లో జపాన్ ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టు ముప్పు అంచున నిలబడి ఉంది. రోజు రోజుకు ఈ ఎయిర్ పోర్టు సముద్రంలో కుంగిపోతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొద్ది సంవత్సరాల్లో పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

జపాన్ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం

జపాన్ ప్రభుత్వం నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతం కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. జపాన్ సముద్ర తీరానికి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో సముద్రంపై దీనిని నిర్మించారు. ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలోనే తొలి తేలియాడే ఎయిర్ పోర్టును నిర్మించారు.  ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం జపాన్ సముద్రంలో కృత్రిమంగా ఐలాండ్ ను తయారు చేసింది. 1987లో ఈ ఎయిర్ పోర్టు పనులు మొదలుకాగా, 1994లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానాశ్రయం ద్వారా ప్రతి ఏటా 25 మిలియన్ల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి  పలు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

Read Also: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?

2025 నాటికి తేలియాడే విమానాశ్రయం కనుమరుగు

అద్భుతమైన ఈ తేలియాడే విమానాశ్రయం ప్రస్తుతం ప్రమాదపు అంచులో నిలబడింది. రోజు రోజుకు ఈ విమానాశ్రయం కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. 2020 వరకు ఈ విమానాశ్రయం 20 అడుగుల మేర మునిగిపోయినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మించే సమయంలోనే కొంత మేర ముంపు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, వారు అనుకున్న అంచనా కంటే 25 శాతం ఎక్కువగా మునిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.   ఈ విమానాశ్రయం నెమ్మదిగా నీటమునగడం ఖాయం అంటున్నారు ఇంజినీరింగ్ నిపుణులు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో నింపిన మట్టి నెమ్మదిగా సముద్రంలో కలిసిపోవడం వల్లే విమానాశ్రయం కుంగినట్లు గుర్తించారు. 2050 నాటికి ఈ విమానాశ్రయం పూర్తిగా నీటమునిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ విమానాశ్రయాన్ని ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు అధికారులు తగి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఎంత వరకు సక్సెస్ అవుతాయనే విషయంపై క్లారిటీ లేదు.

Read Also: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు, సమ్మర్ లో ప్లాన్ చేసేయండి!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×