E-Paper
Advertisement

Longest Train Journey: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?

Longest Train Journey: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?
Advertisement

 World’s Longest Train Journey: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థలు రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అత్యంత వేగవంతమైన రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణాలు చేసే బోలెడు రైళ్లు ఉన్నాయి. వాటిలో లాంగెస్ట్ రైల్వే జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైలు ఏకంగా 13 దేశాలను కలుపుతుంది. పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు జర్నీ చేస్తుంది. 18, 755 కిలో మీటర్ల మేర ఏకబిగిన ప్రయాణం చేస్తుంది. ఈ రైలు ప్రయాణం 14 రోజుల పాటు కొనసాగుతుంది. పలు దేశాలు, భిన్న సంస్కృతులు, వేష భాషలు కలిగిన జనాలు ఈ రైలులో ప్రయాణం చేస్తారు.

ఈ రైలు ప్రయాణానించే దేశాలు ఇదే!

Advertisement

ఈ సుదూర రైలు ప్రయాణం పోర్చుగల్ లోని అత్యంత సుందరమైన లాగోస్ నగరం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి స్పెయిన్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత రష్యా, చైనా, వియత్నాం, థాయ్ లాండ్ మీదుగా సింగపూర్ కు చేరుకుంటుంది. ఈ రైలు పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలను కనెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ రైలు మొత్త 11 రూట్ స్టాఫ్ లను కలిగి ఉంటుంది. ఈ ప్రయాణం ఒకసారి మొదలైతే, రెండు వారాల పాటు ఆగకుండా కొనసాగుతుంది.

పలు దేశాల సహకారంతో సుదూర రైలు ప్రయాణం

Advertisement

ఈ రైలును ఏ ఒక్క దేశం సొంతంగా నడిపించదు. పలు దేశాలు కలిపి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యాయి. కొద్ది నెలల క్రితం ప్రారంభమైన లావోస్, చైనా రైల్వే లైన్ యూరప్, ఆసియా ఖండాలను కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. లావోస్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడంలో ఈ రైల్వే లైన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నది.

ఈ రైల్లో ప్రయాణించాలంటే ఛార్జ్ ఎంత అవుతుందంటే?  

ఇక ఈ పూర్తి రైలు ప్రయాణం చేయడానికి టికెట్ ధర 1350 డాలర్లుగా ఉంటుంది. భారత కరెన్సీలో దాదాపు రూ. 1.13,998. విమాన ఛార్జీలతో పోల్చితే చాలా తక్కువగానే ఉంటుంది. అయితే, ఈ రైలు ప్రయాణం చేయాలంటే చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలంటుంది. ఈ రైలు ప్రయాణానికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బెర్త్ సెలెక్షన్ కు చూడా చాలా పోటీ ఉంటుంది.

మొదట్లో ఇబ్బందులు ఉన్నా..

గతంలో పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు రైలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకే లైన్ కాకుండా పలు మార్గాల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత చైనాలోని కున్మింగ్, లావోస్ రాజధాని  వియంటియాన్ కు కొత్త రైల్వే మార్గం నిర్మించారు. ఈ లైన్ కు పోర్చుగల్- సింగపూర్ రూట్ ను లింక్ చేశారు. ఆ తర్వాత ఈ రూట్ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే లైన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్లో ప్రయాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ రైలు 100కు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం విశేషం.

Read Also: రైలులో చైన్ లాగితే ఇత్తడే.. అది ఏయే సందర్భాల్లో వాడాలంటే?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×