BigTV English

Tourist Injuries: ‘రాధేశ్యామ్’ పూజా హెగ్డేలా రైలుకు వేలాడింది.. సొరంగం రావడంతో..

Tourist Injuries: ‘రాధేశ్యామ్’ పూజా హెగ్డేలా రైలుకు వేలాడింది.. సొరంగం రావడంతో..

Chinese Tourist Injuries:సెల్పీలు, రీల్స్ పిచ్చితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫోటోలు దిగుతూ రకరకాల ప్రమాదాలకు గురై ప్రాణాలు వదిలారు. అయినప్పటికీ జనాల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఓ చైనీస్ పర్యాటకురాలు కదులుతున్న రైల్లో ‘రాధేశ్యామ్’ సినిమాలో పూజా హెగ్డేలా ఫోజులుల ఇవ్వాలనుకుంది. రైలు నుంచి బయటకు వంగి ఫోటోకు ఫోజు ఇవ్వగానే సొరంగం గోడకు తల ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతోంది.


శ్రీలంకలో చైనా టూరిస్టుకు గాయాలు

చైనాకు చెందిన ఓ పర్యాటకురాలు రీసెంట్ గా శ్రీలంకలో పర్యటించింది. టూర్ లో భాగంగా ఈ నెల 9న నాను ఓయా-బడుల్లా మార్గంలో రైలు ప్రయాణం చేసింది. ఈ సమయంలో ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణిస్తుంటే, ఫోటోకు ఓ చక్కటి ఫోజు ఇవ్వాలనుకుంది.  రెండు చేతులతో రైలును పట్టుకుని బయటకు వంగింది. అదే సమయంలో రైలు సొరంగంలోకి దూసుకెళ్లడంతో ఆమె తల సొరంగం గోడకు బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హఫుటలే హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని చైనా రాయబార కార్యాలయం చైనా నుంచి వచ్చిన పర్యాటకులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రైలు ప్రయాణ సమయంలో డోర్లకు దూరంగా ఉండటంతో పాటు ఫోటోల కోసం రైలు నుంచి బయటకు వంగకూడదని వార్నింగ్ ఇచ్చింది. రైల్వే ట్రాక్ ల ద్వారా ఫోటోలు దిగడం, ఆటలు ఆడటం లాంటి పనులు చేయకూడని సూచించింది.


ఫిబ్రవరిలో రష్యన్ పర్యాటకుడు మృతి

తాజాగా ఘటనలో చైనా పర్యాటకురాలు ప్రాణాలతో బయటపడినా, ఫిబ్రవరిలో జరిగిన రైలు ప్రమాదంలో 53 ఏండ్ల రష్యన్ ప్రయాణీకుడు చనిపోయాడు. ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ, రైల్లో నుంచి జారి పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు చాలా మంది ఈ ప్రదేశంలో ఫోటోలు తీసేందుకు, దిగేందుకు ప్రయత్నించి ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక టూర్ గైడ్ క్రిష్ తెలిపారు. చాలా మంది తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఉన్నాయన్నారు. వీలైనంత వరకు ప్రయాణీకులు ఇక్కడ ఫోటోలు దిగాలన్నా, తీయాలన్నా కాలిప్సో అనే నెమ్మదిగా ప్రయాణించే రైలులో వెళ్లాలని సూచించారు. ఈ రైలు ప్రత్యేకంగా ఫోటోలు తీయాలనుకునే వారి కోసం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ ట్యూబ్, వేగం ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

సోషల్ మీడియాలో జోరుగా చర్చ

శ్రీలంకలోని నాను ఓయా-బడుల్లా మార్గంలో ప్రయాణీకులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సినిమాల్లో చూపించినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని సూచిస్తున్నారు. ఒక ఫోటో కోసం జీవితాన్ని కోల్పోవడం సరికాదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: అలర్ట్, 26 రైళ్లు రద్దు.. మీరు వెళ్లే రైళ్లు ఉన్నాయేమో వెంటనే చెక్ చేసుకోండి!

Related News

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: ఇవాళ 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

Big Stories

×