E-Paper
Advertisement

Railways Amendment Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం, ప్రైవేటీకరణపై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

Railways Amendment Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం, ప్రైవేటీకరణపై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Indian Railway: రైల్వే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. రైల్వే బోర్డు పనితీరు,  స్వతంత్రతను మరింతగా పెంచేందుకు ప్రస్తుత రైల్వే చట్టాలను సవరిస్తూ తీసుకొచ్చిన రైల్వే (సవరణ) బిల్లు 2024ను లోక్ సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే సంస్థను ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో దిగువ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లు ఆమోదం పొందింది.

ప్రైవేటీకరణ వార్తల్లో వాస్తవం లేదు!

Advertisement

రైల్వే సవరణ బిల్లుపై లోక్ సభలో కీలక చర్చ జరిగింది. పలువురు విపక్ష సభ్యులు రైల్వే సంస్థను ప్రైవేటీకరించే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఈ సవరణల ద్వారా రైల్వేలను ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైల్వే బోర్డు పనితీరును  మెరుగుపర్చడంతో పాటు దాని స్వతంత్రతను మరింతగా పెంచేందుకుకే రైల్వే సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా రైల్వే సవరణ బిల్లుపై అవాస్తవ ప్రచారాలను మానుకోవలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షాల అభ్యంతరాలు, తోసిపుచ్చిన కేంద్రం  

Advertisement

గత వారం రోజులుగా లోక్‌ సభలో తరచూ విపక్షాలు ఆందోళనలు కొనసాగడంతో బిల్లుపై చర్చ జరగలేదు. తాజాగా ఈ బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చ నిర్వహించారు. రైల్వే చట్ట సవరణలు ప్రైవేటీకరణకు కారణం అవుతాయని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య పౌరులకు రైల్వే సేవలు దూరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైల్వేలోకి ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతుందని విమర్శించారు. విపక్షాల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రైల్వే సంస్థ ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని తేల్చి చెప్పింది. “రైల్వే ప్రైవేటీకరణకు బిల్లు దారి తీస్తుందని కొంతమంది సభ్యులు చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవం. రైల్వేలను ఆధునీకరించడం, బలోపేతం చేయడమే మా లక్ష్యం. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించమం ”అని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

రైల్వేసవరణ బిల్లు- 2024లో కీలక అంశాలు  

రైల్వే బోర్డ్‌ కు మరింత స్వయం ప్రతిపత్తి, కార్యాచరణ సౌలభ్యాన్ని కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది.  రైల్వే సంస్థకు సంబంధించిన రూలింగ్, నిర్ణయాధికారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ బిల్లులోని కీలక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ స్వతంత్రత: ఈ బిల్లు ద్వారా రైల్వే బోర్డు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

⦿ కార్యాచరణ సౌలభ్యం: రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన కార్యాచరణ, ప్రతిస్పందన మెరుగుపడనుంది.

⦿ ఆధునిక పద్దతులు: మెరుగైన రవాణా కోసం రైల్వేబోర్డు గ్లోబల్ స్టాండర్డ్స్‌ తో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్‌ వర్క్‌ ను రూపొందించుకోవచ్చు.

తాజా రైల్వే సవరణ బిల్లుతో భారతీయ రైల్వే సంస్థ మరింత బలోపేతం అవుతుందని పలువురు రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే బోర్డు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు రైల్వేల విస్తరణ, సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.

Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి, దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×