E-Paper
Advertisement

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రాజమండ్రి–విశాఖ డబుల్ లైన్ కు గ్రీన్ సిగ్నల్!

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రాజమండ్రి–విశాఖ డబుల్ లైన్ కు గ్రీన్ సిగ్నల్!
Advertisement

Rajahmundry–Vizag Rail Expansion: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు కొత్త రైల్వే లైన్ల అభివృద్ధికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ. 9,889 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తూర్పు తీర ప్రాంతంలో ఇప్పటికే ఉన్న రద్దీని తగ్గించడం, రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అత్యంత బిజీ మార్గాల్లో ఒకటి

ప్రస్తుతం రాజమండ్రి- విశాఖపట్నం మార్గం దేశంలోనే అత్యంత బిజీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటిగా కొనసాగుతోంది.  ప్రయాణికులు మాత్రమే కాకుండా గూడ్స్ రవాణా కూడా ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో అదనపు లైన్లు నిర్మించడం ద్వారా రద్దీని తగ్గించాలని రైల్వే భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, రైళ్లు సమయానికి నడిచే అవకాశం పెరుగుతుంది.

కొత్త ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు

Advertisement

ఈ కొత్త ప్రాజెక్టుతో ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతోంది. కొత్త లైన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ విభజన జరిగి, రైళ్లు వేగంగా నడవడానికి మార్గం సుగమమవుతుంది. దీని వల్ల ప్రయాణికులకు సమయ ఆదా అవుతుంది.

Read Also: సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్‌కు ఇంత డిమాండా? దేశంలో ఏ స్థానంలో నిలిచిందంటే?

Advertisement

ఇక సరుకు రవాణా విషయానికి వస్తే, ఈ మార్గం పోర్టులకు కీలకంగా ఉపయోగపడుతుంది. విశాఖపట్నం పోర్ట్ దేశంలో ప్రధాన సముద్ర తీర కేంద్రాలలో ఒకటి. కొత్త లైన్లు నిర్మించడంతో సరుకు రవాణా మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపార రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మరింత లాభం కలగనుంది. నిర్మాణ దశలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తులో పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు పెరగడానికి ఇది సహకరిస్తుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల కొత్త పెట్టుబడులు ఆకర్షించే అవకాశం కూడా ఉంది.

గ్రామీణ రైల్వే కనెక్టివిటీకి మరింత ఊతం

అటు, గ్రామీణ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం పట్టణాలకు వెళ్లడం సులభమవుతుంది. ఇది ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది. రాజమండ్రి–విశాఖపట్నం మధ్య కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యాల అభివృద్ధి మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక పురోగతికి కూడా దోహదపడే కీలక అడుగుగా భావించవచ్చు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం అవుతుంది.

Read Also: పేమెంట్ ఫెయిల్ అయినా నో టెన్షన్, హ్యాపీగా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×