BigTV English
Advertisement

Train Travel New Rules: ప్రయాణికులూ జాగ్రత్త..మే 1 నుంచి రైలు నిబంధనల్లో భారీ మార్పులు

Train Travel New Rules: ప్రయాణికులూ జాగ్రత్త..మే 1 నుంచి రైలు నిబంధనల్లో భారీ మార్పులు

Train Travel New Rules: భారతీయ రైల్వేలు మన దేశంలో చాలా కీలకమైన ప్రయాణ మార్గం. ప్రతి రోజూ కూడా లక్షలాది మంది దీనినే నమ్ముకొని వారి పనుల కోసం ప్రయాణిస్తుంటారు. చౌకగా, సౌకర్యంగా ఉండే ఈ రైలు ప్రయాణం ఇప్పుడు కొంత ఖరీదుగా, కాస్త కఠినంగా మారబోతుంది. అవును మీరు చదివింది నిజమే. మే 1, 2025 నుంచి భారతీయ రైల్వేలు కొన్ని కొత్త నియమాలను అమలు చేయబోతున్నాయి. ఈ మార్పులు సాధారణ ప్రయాణికులపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


వెయిటింగ్ టికెట్‌తో ఇకపై రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం నిషేధం
ఇప్పటివరకు వెయిటింగ్ టికెట్ ఉన్నవారు కూడా స్లీపర్ లేదా AC కోచ్‌లో ఎలాగోలా ప్రయాణించేవారు. కానీ మే 1 నుంచి ఇది పూర్తిగా నిషేధం. వెయిటింగ్ టికెట్ ఉన్నవారికి ఇక రిజర్వ్డ్ కోచ్‌లలో ఎంట్రీ లేదు.

ఎక్కడ ప్రయాణించాలి?
జనరల్ కోచ్‌లో మాత్రమే వెయిటింగ్ టికెట్ పనిచేస్తుంది. అంటే ఇది ఎక్కువ రద్దీకి దారితీయొచ్చు.


మార్పు ఏంటి?
స్లీపర్, AC కోచ్‌లలో రద్దీ తగ్గుతుంది. కానీ చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసే వారికి ఇది పెద్ద సమస్యగా మారుతుందని చెప్పవచ్చు. టీటీఇలు (TTE) మరింత కఠినంగా తనిఖీలు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది. లేదా రైలు దిగేయాల్సి ఉంటుంది.

పెరిగిపోయిన ఛార్జీలు
కొత్త నియమాల్లో మరో ముఖ్యమైన మార్పు టికెట్ ఛార్జీలు పెరగడం. రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్, తత్కాల్ ఛార్జీలన్నీ పెరిగాయి.

కొత్త ఛార్జీలు ఇలా :
-రిజర్వేషన్ ఛార్జీ: స్లీపర్ –20 → రూ.30-రూ.40
-AC 3 టైర్ – రూ.40 → రూ.60-రూ.80
-సూపర్‌ఫాస్ట్ ఛార్జీ: రూ.15-రూ.75 → రూ.20-రూ.100

తత్కాల్ ఛార్జీ:
-స్లీపర్ – రూ.100-రూ.200 → రూ.120-రూ.250
-AC 3 టైర్ – రూ.300-రూ.400 → రూ.350-రూ.450

ఎఫెక్ట్:
ఈ క్రమంలో టికెట్ల ధరలు పెరిగిపోతాయి. తక్కువ బడ్జెట్‌తో ప్రయాణించే వారికి ఇది భారంగా మారొచ్చు.

ముందస్తు బుకింగ్ పీరియడ్ తగ్గింపు (New Train Travel Rules)
ఇప్పటి వరకు మీరు 120 రోజుల ముందు టికెట్ బుక్ చేయగలిగేవారు. ఇకపై ఆ అవకాశం లేదు. 60 రోజుల ముందు మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోవాలి.

ఎఫెక్ట్
-ముందుగానే ప్లాన్ వేసుకునే ప్రయాణికులకు ఇది సమస్యగా మారుతుంది.
-పండుగల సమయాల్లో టికెట్లపై పోటీ ఎక్కువగా ఉంటుంది.

Read Also: Regional Rural Banks: మే 1 నుంచి 15 బ్యాంకుల విలీనం..

జీఎస్టీ + డైనమిక్ ఛార్జీలు కొనసాగుతాయి
-AC కోచ్ టికెట్లపై 5% జీఎస్టీ అలాగే ఉంటుంది
-కొన్ని రైళ్లలో డిమాండ్ బట్టి టికెట్ రేటు మారుతుంది (డైనమిక్ ప్రైసింగ్).

ఫలితం:
-డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర మరింత పెరుగుతుంది. బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి.
-కొత్తగా వస్తున్న రైళ్లు
-మరోవైపు ప్రయాణికులకు కొన్ని మంచి వార్తలు కూడా ఉన్నాయి. 2025లో మూడు కొత్త రైళ్లు రానున్నాయి:
-వందే భారత్
-వారణాసి-లక్నో స్పెషల్
-గంగా సట్లెజ్ ఎక్స్‌ప్రెస్
-వీటి షెడ్యూల్స్, రూట్స్ IRCTC వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

ఈ కొత్త నియమాలు ఎందుకు?
-ఈ మార్పులు ఎందుకు చేశారంటే…
-రద్దీ తగ్గించాలనే ఉద్దేశం
-ధృవీకరించబడిన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
-అనధికార ప్రయాణం తగ్గించాలనే ప్రయత్నం
-ట్రాన్స్‌పరెంట్ టికెట్ బుకింగ్ వ్యవస్థ

ప్రయోజనాలు
-ధృవీకరించబడిన టికెట్ ఉన్నవారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం.
-స్లీపర్, AC కోచ్‌లలో రద్దీ తగ్గడం.
-భద్రత, పరిశుభ్రత మెరుగవడం.
-బుకింగ్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారడం.

సమస్యలు
-వెయిటింగ్ టికెట్ ఉన్నవారికి చాలా ఇబ్బంది.
-జనరల్ కోచ్‌లలో రద్దీ అధికం.
-ధరలు పెరగడం వల్ల బడ్జెట్ ప్రయాణికులకు భారంగా మారే అవకాశం.
-కుటుంబ ప్రయాణంలో టికెట్లు సమంగా రాకపోతే సమస్యలు రావొచ్చు.

టికెట్ ధరలు ఎలా నిర్ణయిస్తారు?
-ఒక టికెట్ ధర నిర్ణయించే పద్ధతి ఇలా ఉంటుంది:
-ప్రాథమిక ఛార్జీ – దూరం, క్లాస్ ఆధారంగా
-రిజర్వేషన్ ఛార్జీ
-సూపర్‌ఫాస్ట్ ఛార్జీ
-తత్కాల్ ఛార్జీ
-క్యాటరింగ్ ఛార్జీ
-జీఎస్టీ – 5% (AC కోచ్‌లకు)
-డైనమిక్ ఛార్జీలు – డిమాండ్ బట్టి మారే ధరలు

ప్రయాణికులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
-60 రోజులు ముందే బుక్ చేయండి – కన్ఫర్మ్డ్ టికెట్ రావడానికి మంచి అవకాశం.
-వెయిటింగ్ టికెట్‌ ఉంటే – జనరల్ కోచ్‌లకే వెళ్తారు. రిజర్వ్డ్ కోచ్‌లో ప్రయాణించలేరు.
-IRCTC వెబ్‌సైట్/App‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి – షెడ్యూల్స్, లభ్యత కోసం.
-బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేయండి – ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×