E-Paper
Advertisement

Mexico School: వామ్మో.. స్కూల్ లో సమాధులు, తవ్విచూస్తే అన్ని శవాలే!

Mexico School: వామ్మో.. స్కూల్ లో సమాధులు, తవ్విచూస్తే అన్ని శవాలే!
Advertisement

Viral News: తరచుగా తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడటం చూస్తుంటాం. బంగారు, వెండి నాణేలు, శతాబ్దాల నాటి పనిముట్లు లేదంటే వంట పాత్రలు, సహా ఎన్నో రకాల వస్తువులు కనిపిస్తుంటాయి. కొంత మందికి లంకె బిందెలు కూడా దొరికిన సందర్భాలున్నాయి. అలాగే ఓ స్కూల్ పునర్నిర్మాణ పనుల్లోనూ ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆ స్కూల్ కింద ఏకంగా స్మశానవాటిక బయటపడటంతో అందరూ షాకయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

స్మశానం పైనే స్కూల్!

Advertisement

మెక్సిలోని జకాటెకాస్‌ ప్రాంతంలో వాలెంటిన్ గోమెజ్ ఫారియాస్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్ ఎన్నో దశాబ్దాలుగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. ఈ పాఠశాల బిల్డింగ్స్ పూర్తిగా పాతవి కావడంతో వాటిని కొత్తగా మార్చాలని స్కూల్ యాజమాన్యం భావించింది. అనుకున్నట్లుగానే స్కూల్ రెన్నోవేషన్ పనులు మొదలు పెట్టారు. దాదాపు ఈ పనులు కూడా పూర్తి కావొచ్చాయి. ఒకే ఒక్క తరగతి గదిలోని మార్పుల్స్ మార్చాలి అనుకున్నారు. ముందుగా ఆ క్లాస్ లోని బండలను తొలగించారు. కొత్త బండలు వేయడానికి నేలను తవ్వాలి అనుకున్నారు. గడ్డపారలతో తవ్వుతుండగా తరగతి కింద ఏదో వింత శబ్దం వినిపించింది. తొలుత పట్టించుకోకపోయినా, ఆ తర్వాత ఏదో ఉందనే అనుమానం కలిగింది.

ఒక్కసారిగా అందరూ షాక్!

Advertisement

నిర్మాణ కార్మికులు తరగతి గదిలో కాస్త లోతుగా తవ్వారు. లోపలి దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. లోపల శవపేటికలు కనిపించడంతో అందరూ భయపడ్డారు. అలాగే తవ్వగా అస్థి పంజరాలు బయటపడ్డాయి. ఓ శవ పేటికలో ఓ వ్యక్తితో పాటు ఏకంగా 8 మంది పిలలల అస్థి పంజరాలు కనిపించాయి. మరో శవపేటికలో చిన్నారి అస్థి పంజరం దొరికింది. ఆ శవపేటికకు వజ్రాలు చెక్కారు. అంతేకాదు, ఆ డెడ్ బాడీని గోధుమ రంగు వస్త్రంతో చుట్టి ఉంచారు.

చనిపోయిన వారంతా 19వ శతాబ్దం వాళ్లేనా?

పాఠశాల యాజమాన్యం వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ నిపుణులు స్పాట్ కు చేరుకున్నారు. మనుషులను ఖననం చేసిన ఆచారాలు చాలా వింతగా ఉండటం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ అస్థి పంజరాలు ఏ కాలం నాటివి అనే విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోయారు. అయితే, ఈ అస్థి పంజరాలతో 1862 నాటి ఓ కాయిన్ ను గుర్తించారు. ఈ నేపథ్యంలో చనిపోయిన వాళ్లు 19వ శతాబ్దానికి చెందిన వాళ్లు అయి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ దొరికిన వస్తులను, వింత భాషలో రాసిన ఓ కాగితం ముక్కను స్వాధీనం చేసుకుని పరిశోధనలు మొదలు పెట్టారు.

17వ శతాబ్దంలో హాస్పిటల్?

ఈ స్కూల్ బిల్డింగ్ ఉన్న ప్రాంతంలో 17వ శతాబ్దంలో కాన్వెంట్, ఆసుపత్రిగా ఉపయోగించబడినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ అస్థి పంజరాల వయసు, మరణించి వ్యక్తుల వివరాలను కనుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇక ఈ స్కూల్ కు సంబంధించి పనులు సెప్టెంబర్ 2024లో ప్రారంభం కాగా, ఏప్రిల్ చివరి వారంలో ముగిసినట్లు యాజమాన్యం వెల్లడించింది. చివరి రోజు పనుల్లో భాగంగా విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.

Read Also: బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. యువకుడు స్పాట్ లోనే!

Related News

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Big Stories

Advertisement
×