E-Paper
Advertisement

Medaram 2026 Special Trains: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Medaram 2026 Special Trains: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Medaram Special Trains: దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పరిసర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే పోటెత్తుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు వైపు వెళ్లే రూట్లన్నీ రద్దీగా మారుతున్నాయి. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 28 జనసాధారణ్‌ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ రైళ్లు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి బయల్దేరుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.

28 రైళ్లలో నో రిజర్వేషన్స్  

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం ప్రత్యేక రైళ్లు జనసాధారణ్ రైళ్లు అని రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో రిజర్వేషన్ ఉండదన్నారు. ఈ రైళ్లలో అన్ని జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయని వెల్లడించారు. ఈ రైళ్లను మేడారం వెళ్లే భక్తులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఏ రైలు ఎప్పుడు అందుబాటులో ఉంటుందంటే?

ఈనెల 28, 30, ఫిబ్రవరి 1న సికింద్రాబాద్‌ -మంచిర్యాల- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్‌-మంచిర్యాల రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. ఇదే రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల-సికింద్రాబాద్ రైలు(07496) మంచిర్యాల నుంచి బయల్దేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ కు వస్తుంది. ఈ రైలు చర్లపల్లి, ఘట్ కేసర్, బీబీనగర్, భువనగిరి, ఆలేరు, పెంబర్తి, రఘునాథ్ పల్లి, కాజీపేట, వరంగల్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘువపురం, రామగుండం, పెద్దంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

అటు జనవరి 29, 31న సికింద్రాబాద్‌- సర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్‌ (07497/07498) నడుమ మేడారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటాయి. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ లో బయల్దేరి రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటాయి. ఈ రైళ్లు మౌలాలి, ఘట్ కేసర్, బీబీనగర్, కాజీపేటతో సహా పలు స్టేషన్లలో ఆగుతాయి.

ఈ నెల 28 నుంచి 31 వరకు నిజామాబాద్‌- వరంగల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయల్దేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటాయి. మరోవైపు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఈ నెల 28, 29 తేదీల్లో ఆదిలాబాద్‌-కాజీపేట(07501) నడుమ ప్రత్యేక రైలు నడుస్తుంది.

Read Also: చర్లపల్లికి అమృత్ భారత్ వచ్చేస్తోంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆగుతుందంటే?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×