E-Paper
Advertisement

Flights Cancel: విమానాలు రద్దు.. ఆ నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు

Flights Cancel: విమానాలు రద్దు.. ఆ నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు
Advertisement

Flights Cancel: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని పలు విమానాశ్రయాలు మూసివేయడంతో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసిన రైల్వే శాఖ, స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది. జమ్మూ, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో విమానాశ్రయాలు మూసివేయడంతో చిక్కుకున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రైలు కార్యకలాపాలను సమీక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ రైళ్లను నడపాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ వివిధ ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసి, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రయాణికులకు సహాయం అందించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో జమ్మూ, ఉధంపూర్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపారు.

Advertisement

జమ్మూ స్టేషన్ నుంచి ఉదయం 10:45 గంటలకు 04612 నంబర్ రైలు బయలుదేరింది. ఈ రైలులో 12 అన్‌రిజర్వ్‌డ్, 12 రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నాయి. అదే రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు ఉధంపూర్ నుంచి 20 కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జమ్మూ, పఠాన్‌కోట్ మీదుగా న్యూఢిల్లీకి చేరింది. సాయంత్రం 7 గంటలకు జమ్మూ నుంచి 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో మరో స్పెషల్ రైలు నడిచింది. అలాగే, రాత్రి 11:55 గంటలకు జమ్మూ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్ మీదుగా గౌహతికి అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైలు బయలుదేరింది.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అభ్యర్థన మేరకు ఐపీఎల్ ఆటగాళ్లు, అధికారుల కోసం ప్రత్యేక వందే భారత్ రైలును కూడా నడిపారు. ఈ రైలు ఆటగాళ్లను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ రైళ్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు, విమాన సర్వీసుల రద్దు వల్ల ఏర్పడిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి.

Advertisement

వారణాసి జంక్షన్‌లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు. రైల్వే స్టేషన్లలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైలు సర్వీసులు ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. రైల్వే శాఖ ఈ స్పెషల్ రైళ్ల సంఖ్యను అవసరాన్ని బట్టి మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related News

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×