Golden Chariot Luxury Train: భారతీయ రైల్వే సంస్థ(Indian Railways) తక్కువ ఖర్చుతో నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నది. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది రైలు ప్రాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. ఓవైపు పేద ప్రజలకు తక్కువ ధరలో రైలు ప్రయాణాన్ని అందిస్తున్న ఇండియన్ రైల్వే, అత్యంత లగ్జరీ రైలు (Luxury Train) ప్రయాణాలను కూడా అందిస్తున్నది. దేశంలోనే అత్యంత లగ్జరీ ప్రయాణాన్ని అందించే ఓ రైలు గురించి తాజాగా ఆస్ట్రేలియన్ చెఫ్, కంటెంట్ క్రియేటర్ సారా టాడ్(Sarah Todd) ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జిమ్ నుంచి వెల్ నెస్ స్పా వరకు
సారా టాడ్ స్పెషల్ వీడియో చేసిన రైలు మరేదో కాదు, గోల్డెన్ చారియట్ లగ్జరీ ట్రైన్ (Golden Chariot Luxury Train). భారతీయ రైల్వే సంస్థ IRCTCతో కలిసి ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. 7 స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఈ రైల్లో మొత్తం 13 డబుల్ బెడ్ క్యాబిన్లు, 26 ట్విన్ బెడ్ క్యాబిన్లతో పాటు దివ్యాంగుల కోసం ఓ క్యాబిన్ ఉన్నది. కేవలం 40 క్యాబిన్లతో కూడిన ఈ రైల్లో 80 మంది మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఇది కర్ణాటక, కేరళ, గోవా, తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను వారానికోసారి కలుపుతుంది. హంపి విఠ్ఠల దేవాలయం వద్ద ఉన్న రాతి రథం పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. రైలు యొక్క 19 పర్పుల్ మరియు గోల్డ్ కోచ్లు ఏనుగు తల మరియు సింహం శరీరంతో పౌరాణిక జంతువు యొక్క లోగోను కలిగి ఉంటాయి. దక్కన్ ఒడిస్సీ వలె, దాని సౌకర్యాలు ప్యాలెస్ ఆన్ వీల్స్ మీద ఆధారపడి ఉంటాయి. గోల్డెన్ చారియట్ కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు మాపిల్ గ్రూప్ ఆతిథ్యంతో లగ్జరీ రైళ్ల ద్వారా విక్రయించబడుతుంది. ఈ రైలులో 11 కోచ్లలో 44 క్యాబిన్లు ఉన్నాయి.ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలు: కదంబ, హోయసల, రాష్ట్రకూట, గంగ, చాళుక్య, బహమనీ, ఆదిల్ షాహి, సంగమ, శాతవాహన, యదుకుల మరియు విజయనగరం. ఇందులో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి, ఒక లాంజ్, కాన్ఫరెన్స్, జిమ్ మరియు స్పా సౌకర్యాలు మరియు ఉపగ్రహ టెలివిజన్, ఇది ఆన్బోర్డ్ Wi-Fi కనెక్టివిటీతో భారతదేశం యొక్క ఏకైక రైలు. ఈ రైలు అత్యంత విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అన్నీ లగ్జరీ క్యాబిన్లు ఉంటాయి. ప్రతి క్యాబిన్ లో ఏసీతో పాటు వైఫై ఉంటుంది. ప్రతి క్యాబిన్ లో పెద్ద టీవీ ఉంటుంది.
నోరూరించే వంటకాలు, స్పెషల్ వెల్ నెస్ స్పా
ఇక ఈ రైల్లో ప్రయాణించే వారికి ఇండియన్ ఫుడ్ తో పాటు విదేశీ ఫుడ్ ను అందిస్తారు. ఈ రైలులో రుచి, నలపాక్ పేరుతో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. శాకాహారంతో పాటు మాంసాహారం అందిస్తారు. అత్యంత విలాసవంతమైన బార్ ఉంటుంది. బెస్ట్ బ్రాండెడ్ వైన్, బీరు లభిస్తాయి. ఇక ఈ రైలులో అత్యాధునిక జిమ్ ఉంటుంది. వెల్ నెస్ స్పా సెంటర్ కూడా అందుబాటులో ఉంది. ఈ రైల్లో ప్రయాణించేవారి భద్రతకు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైలు అంతా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.
Karnataka’s Luxury Heritage on Wheels!
Step into a world of elegance with the Golden Chariot Luxury Tourist Train, now in a stunning new avatar! Explore Karnataka’s rich culture while enjoying world-class cabins with smart TVs, elegant furnishings, and top-tier security.
Savor… pic.twitter.com/aSU0ax3MJz
— Western Railway (@WesternRly) November 21, 2024
ఒక్కో టికెట్ ధర సుమారు రూ. 5 లక్షలు
ఇక గోల్డెన్ చారియట్ రైల్లో 5 రాత్రుల, 6 పగళ్లు గడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింద. ఈ రైల్లో ఒక్కో టికెట్ ధర రూ. 4,00, 530 గా నిర్ణయించారు. విదేశీయులకు రోజుకు రూ. 61,000 వసూళు చేస్తున్నారు. 5 నుంచి 12 సంవత్సరాలు గల పిల్లలకు టికెట్ ధర సగానికి తగ్గించారు. ఈ రైలు విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నది. గోల్డెన్ చారియట్ రైలును జీవితంలో ఒక్కసారైన ఎక్కాలంటున్నది సారా టాడ్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: 13 దేశాలను కలిపే ఏకైక రైలు, ప్రపంచంలో ఇదే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ!