E-Paper
Advertisement

Laddu Kiosks Machines: తిరుమల లడ్డూ కోసం ఇక నో వెయిటింగ్, సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు!

Laddu Kiosks Machines: తిరుమల లడ్డూ కోసం ఇక నో వెయిటింగ్, సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు!
Advertisement

TTD Laddus Kiosk Machines: ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని ఇకపై మరింత ఈజీగా కొనుగోలు చేసేలా టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. భక్తులు కౌంటర్లలో వెయిట్ చేయకుండా ఉండేలా కియోస్క్ ల ద్వారా లడ్డూలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తాజాగా ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. నిజానికి అదనపు లడ్డూ ప్రసాదాన్ని పొందాలనుకునే భక్తులు, లడ్డూ విక్రయ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది.

కియోస్క్ ల ద్వారా లడ్డూలు ఎలా కొనుగోలు చేయాలి?

Advertisement

కియోస్క్ ల ద్వారా లడ్డూలను ఈజీగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భక్తులు దర్శనం అనంతరం, తమ దర్శన టికెట్ నంబర్ ను కియోస్క్ లో ఎంటర్ చేయాలి. తమకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత వచ్చిన రిసీప్ట్ ను లడ్డూ కౌంటర్ లో ఇవ్వాలి. కౌంటర్ లోని వాళ్లు వెంటనే లడ్డూలను అందిస్తారు. ఒకవేళ దర్శనం టికెట్లు లేకుంటే, తమ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.

ఇలా చేయండి.. 

Advertisement

⦿ ముందుగా లడ్డూ కౌంటర్ల దగ్గర ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ దగ్గరికి వెళ్లాలి.

⦿ దర్శనం టికెట్ ఉంటే ఓ ఆప్షన్, లేకుంటే మరో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ ఒకవేళ దర్శనం టికెట్ ఉంటే, టికెట్ వివరాలను అందులో ఎంటర్ చేయాలి.

⦿ టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల వరకు అనుమతిస్తుంది.

⦿  దర్శన టికెట్‌ లేనివారు ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేయాలి. ఈ ఆప్షన్ ప్రకారం ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేసుకోవచ్చు.

⦿ సరైన ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి. లావాదేవీలు పూర్తి అయిన తర్వాత రసీదు వస్తుంది.

⦿ ఆ రసీదును తీసుకెళ్లి లడ్డూ కౌంటర్ లో ఇస్తే, వాళ్లు లడ్డూలు అందిస్తారు.

Read Also: వందే భారత్ లో విండో సీట్ కోసం ఇన్ని నాటకాలా? మీకు ఇలా జరిగిందా?

మున్ముందు 4 లడ్డూలకు పెంపు

ప్రస్తుతం కియోస్క్ యంత్రాల ద్వారా 2 లడ్డూలను పొందే అవకాశం ఉండగా, మున్ముందు ఆ సంఖ్య 4కు పెంచాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం లడ్డూ విక్రయ కేంద్రాల్లో 5 యంత్రాలను ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ ఎంక్వయిరీ కేంద్ర దగ్గర మరో 3 ఏర్పాటు చేశారు. మున్ముందు తిరుమల వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది.

Read Also:  ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×